జిల్లా స్థాయి క్రీడలకు కెపిఆర్ గౌతమ్ విద్యార్థులు
Published Friday, 23 September 2016సత్తుపల్లి, సెప్టెంబర్ 22: ఈ నెల 19,20 తేదీలలో వేంసూరు మండలం అడసర్లపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన జోనల్స్థాయి ఖోఖో క్రీడలో సత్తుపల్లి కెపిఆర్ గౌతమ్కు చెందిన విద్యార్థులు ఎం వినయ్, షేక్ మీర్జావలిలు ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ కొప్పుల ప్రసాద్రెడ్డి, కరస్పాండెంట్ మందపాటి ప్రభాకర్రెడ్డిలు విద్యార్థులును అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యా యామ ఉపాధ్యాయులు డి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.