నేడు గొల్లపల్లి కాలువకు నీరు విడుదల
Published Saturday, 24 September 2016అనంతపురం, సెప్టెంబర్ 23 : జీడిపల్లిలో నిల్వ ఉంచిన హంద్రీనీవా నీటిని శనివారం గొల్లపల్లి రిజర్వాయర్ కాలువకు విడుదల చేయనున్నారు. పంపనూరు గ్రామ సమీపంలోని శింగంపల్లి వద్ద నేటి ఉదయం 10.45 గంటలకు జిల్లా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ కోన శశిధర్ విడుదల చేయనున్నారు.