తెలంగాణ గ్రూప్-2కు 26వరకు గడువు
Published Saturday, 24 September 2016హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ గ్రూప్-2 కేటగిరి పోస్టులకు దరఖాస్తు చేసే గడువును ఈ నెల 26వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దరఖాస్తు గడువును మరో మూడు రోజుల పాటు పొడిగించినట్టు తెలిసింది. తొలి దశ నోటిఫికేషన్లో దాదాపు ఐదు లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకోగా, మలి దశ నోటిఫికేషన్లో ఇంత వరకూ 1.83 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో దరఖాస్తు చేసుకుని ఇంత వరకూ ఫీజు చెల్లించని వారు సైతం ఈనెల 26లోగా ఫీజు చెల్లించాలని సూచించారు.