మణుగూరు-కాజిపేట ప్యాసింజర్ నేడు రద్దు
Published Saturday, 24 September 2016హైదరాబాద్, సెప్టెంబర్ 23: భారీ వర్షాల కారణంగా గుంటూరు డివిజన్లోని సత్తెనపల్లి-పిడుగురాళ్ళ సెక్షన్లో రైలు పట్టాలు దెబ్బ తిన్న కారణంగా ఒక రైలును రద్దు చేయగా, మరో రైలును మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మణుగూరు-కాజిపేట ప్యాసింజర్ను 24వ తేదీన రద్దు చేసింది. హైదరాబాద్-కోచువెల్లి ప్రత్యేక రైలును శనివారం (24న) దారి మళ్లించి సులెహల్లి, గుంతకల్లు, రేణిగుంట, తిరుపతి మీదుగా మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.