సాగర్ ఔట్ఫ్లోను పరిశీలించిన మంత్రి కెటిఆర్
Published Saturday, 24 September 2016హైదరాబాద్, సెప్టెంబర్ 23 నగరానికి మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తాయన్న హెచ్చరికలుండటంతో మంత్రి కెటిఆర్ ఉదయం నుంచి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని అధికారులతో, కంట్రోల్ రూం ద్వారా పరిస్థితులను పర్యవేక్షించారు. అనంతరం టౌన్ప్లానింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆ తర్వాత సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో హుస్సేన్సాగర్ అలుగుల ద్వారా హోటల్ వైస్రాయ్ వద్ధ విడుదల చేస్తున్న ఔట్ఫ్లోను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.