అభయాంజనేయుని దర్శించుకున్న సింధు
Published Monday, 26 September 2016హనుమాన్ జంక్షన్: ఒలింపిక్స్ పోటీల్లో రజత పతకం సాధించిన భారత షట్లర్ పివి సింధు ఆదివారం స్థానిక అభయాంజనేయుని దర్శించుకున్నారు. గన్నవరం నుంచి ద్వారకా తిరుమల వెళుతున్న సింధు హనుమాన్ జంక్షన్లో కొద్దిసేపు ఆగారు. ఈసందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింధు వెంట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్లూరి రమేష్, అభయాంజనేయ స్వామి ఆలయ పాలక మండలి ఛైర్మన్ పావులూరి రామారావు, తదితరులు ఉన్నారు.