బికె బన్సాల్ ఆత్మహత్య
Published Tuesday, 27 September 2016న్యూఢిల్లి:కార్పొరేట్ వ్యవహారాల శాఖ మాజీ డైరక్టర్ జనరల్ బికె బన్సాల్ తన కుమారుడితో కలసి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజధానిలోని మధురానగర్లో ఆయన నివాసంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ ఫార్మ కంపెనీనుంచి గత జూలైలో 9 లక్షల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడటంతో కేసు నమోదైంది. ఆయన జైలుపాలయ్యారు. ఆ తరువాత కేసు సీబిఐకు చేరింది. దర్యాప్తు సందర్భంగా 60 బ్యాంకు ఖాతాలు, 20 ఆస్తుల పత్రాలు, 60 లక్షల నగదు లభ్యమైంది. ఈనేపథ్యంలో ఆయన భార్య, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా గతనెలలో బెయిల్పై వచ్చిన బన్సాల్, డిప్రెషన్తో బాధపడుతున్న కుమారుడు ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.