ఎస్పీ దృష్టికి భూతగాదాలు
Published Monday, 21 November 2016విజయనగరం, నవంబర్ 21: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు 14 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూ తగాదాలు, కుటుంబ తగాదాలు, ఇతర సమస్యలపై బాధితులు ఎస్పీ ఎల్వికె రంగారావు ఎదుట మొరపెట్టుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలపై ఇద్దరు, భూ తగాదాలపై 5గురు, ఇతర సమస్యలపై 7గురు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ సంబంధిత పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ గ్రీవెన్స్లో ఎస్బి ఎస్సై సాయికృష్ణ పాల్గొన్నారు.