అయ్యప్ప ఆలయం పేరు మార్పు
Published Tuesday, 22 November 2016కోచి, నవంబర్ 21: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం పేరు మారింది. శబరిమల శ్రీ ధర్మ శాస్త్ర ఆలయం పేరును శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయంగా మార్చినట్టు ఆలయ పరిపాలన విభాగం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డునుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో దట్టమైన అడవుల్లో అయ్యప్ప స్వామి వేంచేశారు. ఆలయం పేరు మారుస్తూ గత నెల 5న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్పకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మంది భక్తులున్నారు. జనవరిలో స్వామి దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. కుల, మత, ప్రాంత తేడాలు లేకుండా అయ్యప్పను దర్శించుకుంటారని అధికారులు తెలిపారు.