వికాస్కు ఎఐబిఎ అవార్డు
Published Monday, 28 November 2016న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత బాక్సర్ వికాస్ క్రిష్ణకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) అవార్డు లభించనుంది. వచ్చేనెల 20న జరిగే వార్షిక సమావేశంలో ‘ఉత్తమ బాక్సర్’ అవార్డును బహూకరిస్తామని వికాస్కు రాసిన లేఖలో ఎఐబిఎ తెలిపింది. బాక్సింగ్ రంగానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నామని 2010 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2014లో అవే పోటీల్లో కాంస్య పతకం సాధించిన వికాస్ తనను అవార్డుకు ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. భారత్కు మరిన్ని అంతర్జాతీయ టైటిళ్లను అందించేందుకు కృషి చేస్తానని ప్రస్తుతం అమెరికాలోని న్యూ జెర్సీలో శిక్షణ పొందుతున్న వికాస్ అక్కడి నుంచి పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు.