పరువు నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా
Published Monday, 28 November 2016అడెలైడ్, నవంబర్ 27: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి, మూడో టెస్టును ఏడు వికెట్ల తేడాతో గెలు కున్న ఆస్ట్రేలియా పరువు నిలబెట్టుకుంది. ప్రత్యర్థి చేతిలో వైట్వాష్ వేయంచుకునే దుస్థితి నుంచి బ యటపడింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ను దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 259 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 383 పరుగులు సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో 124 పరుగులు వెనుకబడిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 250 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ ముందు కేవలం 127 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో మూడు వికెట్లు చేజార్చు కొని విజయభేరి మోగించింది. సిరీస్ను దక్షిణాఫ్రికా 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఉస్మాన్ ఖాజాకు లభించింది.