పాండ్యకు మెరుగైన చికిత్స
Published Monday, 28 November 2016మొహాలీ, నవంబర్ 27: భుజం గాయంతో బాధపడుతున్న భారత యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను మెరుగైన చికిత్స కోసం టెస్టు జట్టు నుంచి రిలీజ్ చేశారు. మొహాలీలో ఇంగ్లాండ్తో మూడో టెస్టు ప్రారంభానికి ముందు, నెట్స్లో ఆడుతున్న సమయంలో పాండ్య గాయపడ్డాడు. అతని భుజానికి బలమైన గాయం తగిలిందని, అందుకే మూడో టెస్టుకు అతను దూరమయ్యాడని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి అజయ్ షిర్కే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాడు. స్పెషలిస్టుచే వైద్య పరీక్షలు చేయించుకొని, మెరుగైన చికిత్సను పొందడానికి వీలుగా అతనిని జట్టు నుంచి విడుదల చేశామని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. వైద్య పరీక్షల నివేదికలు అందిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపాడు.