దక్షిణ మధ్య రైల్వే జిఎంగా వశిష్ట జోహ్రి
Published Friday, 2 December 2016హైదరాబాద్, డిసెంబర్ 1: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా వశిష్ట జోహ్రి పదవీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ 1975వ, బ్యాచ్కు చెందిన వశిష్ట జోహ్రి 1979లో ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్గా చేరారు. లక్నో, ముంబయి, విజయవాడ జోన్లలో సమర్థవంతంగా పనిచేశారు. వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.