దేవేంద్రో, మనోజ్ శుభారంభం
Published Saturday, 10 December 2016గౌహతి, డిసెంబర్ 9: ఇక్కడ జరుగుతున్న జాతీయ పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్స్లో దేవేంద్రో సింగ్, మనోజ్ కుమార్ తమ అసలు వెయిట్కు కాకుండా ఇతర వెయిట్లో పోటీపడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శుభారంభం చేశారు. దేవేంద్రో 49 కిలోలకు కాకుండా 52 కిలోల ఫ్లైవెయిట్ విభాగంలో భోజ్రాజ్ను 3-2 తేడాతో ఓడించాడు. మరో ఫైట్లో మనోజ్ 5-0 ఆధిక్యంతో మణికందన్ను చిత్తుచేశాడు. అతను ఈసారి 69 కిలోల వెల్టర్వెయిట్ ఈవెంట్లో పోటీపడుతున్నాడు. మొత్తం మీద శుక్రవారం వివిధ విభాగాల్లో మొత్తం వంద ఫైట్స్ జరిగాయి.