నీటి అడుగున రెస్టారెంట్
Published Sunday, 19 February 2017ఆధునిక ప్రపంచంలో విభిన్న ఆలోచనలకు, సృజనాత్మకతకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మామూలు హోటళ్లలో తింటే ఏం మజా, స్విమ్మింగ్ పూల్లో నీటి అడుగున ప్రేయసితో కలసి విందారగిస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచన కొందరికి వచ్చింది. అంతే బెల్జియంలోని బ్రసెల్స్లోని ఓ హోటల్ వారు స్విమ్మింగ్ పూల్ అడుగున ఓ కేజ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. గుండ్రటి గాజుగోళాల్లో ఈ విందు ఆరగించవచ్చు. ఆక్సిజన్ సరఫరా ఉండే గాజు గోళాల్లో టేబుల్పై భోజనం చేయవచ్చు. ఆహారాన్ని సరఫరా చేసేవారు శిక్షణ పొందిన స్కూబా డైవర్స్. ఎటువంటి ప్రమాదం ఎదురైనా రక్షించేందుకు తగిన ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. ఎవరైనా అక్కడ విందు ఆరగించాలంటే కనీసం వంద డాలర్ల మొత్తాన్ని చెల్లించి సీటు రిజర్వ్ చేసుకోవచ్చు.