S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 01:29

హైదరాబాద్, సెప్టెంబర్ 23: వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు చెందిన స్కెవాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్ధ జాతీయ స్ధాయిలో ఐదు సంస్ధలను సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన వికాస్ షా ఆఫ్ వాటర్ హెల్త్ ఇండియా సంస్ధను ఎంపిక చేశారు.

09/24/2016 - 01:28

ముంబయి, సెప్టెంబర్ 23: వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో గురువారం ఉరకలేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం చతికిల పడ్డాయి. బ్యాకింగ్ స్టాక్స్ లాంటి ఇటీవల లాభాలు ఆర్జించిన స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు మదుపరులు దిగడంతో వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

09/24/2016 - 01:27

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: వ్యవసాయ ఎగుమతులకు సంబంధించిన రాయితీలను రద్దు చేసేందుకు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వ్యవసాయ మంత్రులు శుక్రవారం ఆమోదం తెలిపారు.

09/24/2016 - 01:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సహారా గ్రూపు సంస్థల నుంచి డబ్బును రికవరీ చేసేందుకు ఆ సంస్థకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్న మార్కెట్ నియంత్రణా సంస్థ ‘సెబీ’ ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. ఈ సంస్థకు చెందిన మరో 13 ల్యాండ్ పార్శిళ్లను వచ్చే నెలలో వేలం వేయబోతున్నామని, వీటి మొత్తం రిజర్వు ధరను దాదాపు 1,400 కోట్ల రూపాయలు నిర్ణయించడం జరిగిందని సెబీ స్పష్టం చేసింది.

09/24/2016 - 01:24

సింహాచలం, సెప్టెంబర్ 23: ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర తపాలా శాఖ కార్యదర్శి బివి సుధాకర్ తెలిపారు. సింహాచలం వచ్చిన సందర్భంగా శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి ఒక లక్షా ఏభైవేల పోస్ట్ఫాసుల్లో అన్‌లైన్ సేవలందించేందుకు నెట్‌వర్కింగ్ పూర్తయిందన్నారు.

09/24/2016 - 01:23

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సహారా గ్రూపు సంస్థల అధినేత సుబ్రతా రాయ్‌కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయ. తల్లి చనిపోవడంతో మానవతా కారణాలపై ఇటీవల సుబ్రతా రాయ్‌తో పాటు మరో ఇద్దరికి ఇటీవల మంజూరు చేసిన బెయిల్‌తో పాటు అన్ని రకాల తాత్కాలిక ఊరటలను సుప్రీం కోర్టు శుక్రవారం రద్దు చేసింది.

09/24/2016 - 00:54

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ పంపిణీలో అత్యుత్తమ విధానాలను అమలు చేస్తున్నందుకు ఏపి ట్రాన్స్‌కో సేవలను జాతీయ స్ధాయిలో వినియోగించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఈ వివరాలను ఏపి ట్రాన్స్‌కో జెఎండి దినేష్ పరుచూరి తెలిపారు. జాతీయ స్ధాయిలో విద్యుత్ పంపిణీని పటిష్టం చేయడానికి ఏపి ట్రాన్స్‌కోను సలహాదారుగా కేంద్రం నియమించిందని ఆయన చెప్పారు.

09/24/2016 - 00:52

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్ధ రిలయన్స్ జియో ఇన్ఫ్‌కామ్ సంస్ధ ఈ నెల 25వ తేదీన టెడెక్స్ హైదరాబాద్ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ సంస్ధ ప్రకటించింది. టెడెక్స్ హైదరాబాద్ డిజిటల్ కనెక్టివిటీ పేరుతో ఈ సదస్సును నిర్వహిస్తారు. గచ్చిబౌలి లోని సంధ్య కనె్వన్షన్ సెంటర్‌లో ఈ సదస్సును ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు ప్రారంభిస్తారు.

09/24/2016 - 00:51

ముంబయి, సెప్టెంబర్ 23: సుమారు రూ.6 వేల కోట్ల కార్పస్ నిధితో ప్రభుత్వ రంగ కంపెనీల స్టాక్స్‌తో ఏర్పాటు చేయబోయే రెండవ సిపిఎస్‌ఇ ఎక్స్‌చేంజి ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్)ను నిర్వహించడానికి ప్రభుత్వం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్‌ను మేనేజర్‌గా నియమించింది.

09/24/2016 - 00:51

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రూ.4615 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్ల కొనుగోలుకు విదేశీ ఇనె్వస్టర్లకు పెట్టుబడి పరిమితులను బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి బిఎస్‌ఇ సోమవారం వేలం వేయనుంది. సోమవారం మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 3.30- 5.30 గంటల మధ్య బిఎస్‌ఇకి చెందిన ‘ఇబిడ్‌ఎక్స్‌చేంజి’ ప్లాట్‌ఫామ్‌పై ఈ వేలం నిర్వహిస్తారు.

Pages