S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/05/2016 - 16:08

హైదరాబాద్: చందానగర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మల్లీశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం శనివారం వెలుగుచూసింది. భర్త వేధింపుల వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని మల్లీశ్వరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

03/05/2016 - 16:07

హైదరాబాద్: తన కుమారుడు సుశీల్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైందని, ఆ కేసు విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోననని ఎపి మంత్రి రావెల కిశోర్‌బాబు శనివారం మీడియాకు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు తెలుస్తాయని, తనకు చట్టం, గౌరవం పట్ల అత్యంత నమ్మకం ఉందన్నారు. తన కుమారుడిపై కేసును తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, మంత్రిగా తాను ఎవరిపైనా ఒత్తిడి తెచ్చే ప్రసక్తే లేదన్నారు.

03/05/2016 - 13:29

హైదరాబాద్: ఐటి సేవల వినియోగంలో దేశం మొత్తమీద తమ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖలో స్టార్ట్ ఎపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్టార్టప్‌ల పరిశ్రమకు ఎపి కేంద్ర బిందువుగా మారుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్టార్టప్‌ల ఆవిష్కరణకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సేవలందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

03/05/2016 - 13:29

హైదరాబాద్: ఓ వివాహిత మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించినందుకు ఎపి సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్‌పై ఇక్కడి బంజారాహిల్స్ పోలీసులు నిర్భయ చట్టంలోని సెక్షన్ 345 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం పోలీసులు నిందితుడికి నోటీసులు జారీ చేశారు.

03/05/2016 - 13:28

దిల్లీ: జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ నాలుకను ఎవరైనా కోస్తే- తాను 5 లక్షల రూపాయలను నజరానాగా ఇస్తానని బిజెపి యువనేత కుల్‌దీప్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహం నేరంలో అరెస్టయి రెండు రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైన కన్నయ్య తాజాగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో కుల్‌దీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

03/05/2016 - 13:28

దిల్లీ: పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. శనివారం ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో మహిళా ప్రజాప్రతినిధుల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లయినా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 12 శాతానికి మించలేదని, పరిస్థితి ఇలా ఉంటే మహిళా సాధికారత ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

03/05/2016 - 13:27

హైదరాబాద్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఫోన్‌ను ట్యాప్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని ఎపి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన శనివారం ఎపి అసెంబ్లీ లాబీలో విలేఖరులతో మాట్లాడుతూ, తమ దృష్టిలో ముద్రగడ పెద్ద నాయకుడేమీ కాదన్నారు. కాపుగర్జన సందర్భంగా తునిలో జరిగిన విధ్వంసకాండకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను తమ సర్కారు తప్పక నెరవేరుస్తుందన్నారు.

03/05/2016 - 13:27

విశాఖ: ఈ నెల 7న ఇక్కడ సాగరతీరంలో జరిగే శివరాత్రి వేడుకల సందర్భంగా ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజుకు నటవిరాట్ బిరుదును ప్రదానం చేస్తామని రాజ్యసభ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి శనివారం విలేఖరులకు తెలిపారు. కాగా, ఈనెల 14న ఎపి పిసిసి ఆధ్వర్యంలో ‘చలో దిల్లీ’ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. విశాఖకు రైల్వే జోన్, ఎపికి ప్రత్యేక హోదా విషయమై దిల్లీలో ప్రధానికి వినతిపత్రం సమర్పిస్తామని ఆయన తెలిపారు.

03/05/2016 - 13:26

హైదరాబాద్: ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని వైకాపా నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఆయన శనివారం అసెంబ్లీ వద్ద లాబీలో విలేఖరులతో మాట్లాడుతూ, ఇటీవల టిడిపిలో చేరిన 8 మంది వైకాపా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు లిఖితపూర్వకంగా చెప్పామన్నారు. స్పీకర్ నిర్ణయం తర్వాతే తాము అవిశ్వాసం పెడతామన్నారు.

03/05/2016 - 13:26

హైదరాబాద్: సికింద్రాబాద్ ఎస్‌డి రోడ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంజయ్‌ను దారుణంగా హత్య చేశారన్న అభియోగంపై నలుగురు యువకులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం ఉదయానే్న సంజయ్‌తో పాటు కారులో కొందరు యువకులు ప్రయాణించారని, మద్యం మత్తులో వారు సంజయ్‌తో గొడవ పడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఆ గొడవ కారణంగానే ఆ యువకులు సంజయ్‌ను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు.

Pages