S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/05/2016 - 13:04

విజయనగరం : వేపాడ మండలం దబ్బిరాజిపేట సమీపంలో మేకల మందపై కుక్కలు శుక్రవారం అర్ధరాత్రి దాడిచేశాయి. ఈ దాడిలో 30 మేకలు మృతి చెందాయి. 14 మేకలకు తీవ్రగాయాలయ్యాయి. మేకలు చనిపోవడంతో తీవ్రనష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

03/05/2016 - 11:57

హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఎపి సిఎం చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం పలువురు మంత్రులతో మంతనాలు జరిపారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించినట్లు సమాచారం. డిప్యూటీ సిఎం చినరాజప్ప, మంత్రులు నారాయణ, పుల్లారావు, రఘునాథరెడ్డి, కిశోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

03/05/2016 - 11:56

విజయనగరం: సాలూరులోని ఓ గోడౌన్ నుంచి శనివారం ఉదయం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కోటీ 80 లక్షల రూపాయల విలువచేసే గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

03/05/2016 - 11:56

గుంటూరు: ఏటుకూరు రోడ్డులో ఓ యువకుడిని దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. మృతుడిని రేజేటి మహేష్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

03/05/2016 - 11:55

హైదరాబాద్: ఎ.పి. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఎ.పి. బ్రాహ్మణ ఆర్థిక సంస్థ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు శనివారం భేటీ అయ్యారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఆయన సి.ఎం.తో చర్చించారు.

03/05/2016 - 11:55

హైదరాబాద్: తమ పార్టీ నుంచి టిడిపిలో చేరిన ఎనిమిది మంది సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని వైకాపా ఎమ్మెల్యేల బృందం స్పీకర్‌కు ఓ వినతిపత్రం సమర్పించింది. జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో 12 మంది వైకాపా ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కలిసి ఈ మేరకు తమ వాదనను వినిపించారు.

03/05/2016 - 11:55

విశాఖ: సినీ పరిశ్రమకు సంబంధించి తెలంగాణ కళాకారుల సంఘం ఏర్పాటుకు కొంతమంది ప్రయత్నించగా, ఎ.పి. కళాకారులు అడ్డుకోవడంతో విశాఖలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అక్కయ్యపాలెంలో తెలంగాణ జూనియర్ ఆర్టిస్టుల సంఘం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుండగా ఎ.పి. కళాకారులు అక్కడ ఫ్లెక్సీలు, బోర్డులను ధ్వంసం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

03/05/2016 - 11:54

దిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో మహిళా ప్రజా ప్రతినిధుల సదస్సును రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన వహించిన సదస్సులో ఉపరాష్టప్రతి అన్సారీ, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, మహిళా ఎం.పీలు పాల్గొన్నారు.

03/05/2016 - 11:54

విశాఖ: కొంకణ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా శనివారం తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయి. కోస్తా, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఎ.పి.లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

03/05/2016 - 11:53

హైదరాబాద్: ఓ వివాహిత మహిళను వేధించినట్లు ఆరోపణలు రావడంతో ఎ.పి. మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిఆర్‌పిసి 41ఎ కింద నోటీసులు ఇవ్వడంతో సుశీల్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారిస్తారు. గురువారం నాడు తాను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సుశీల్ తన చేయి పట్టుకొని కారులోకి లాగేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Pages