-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్: వచ్చే నెల ఒకటి నుంచి వెలగపూడి సచివాలయం నుంచి విధులు నిర్వర్తించేందుకు ఏపీ సచివాలయ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. మంత్రులందరూ గురువారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో వీరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దసరా నుంచి సీఎం చంద్రబాబు వెలగపూడిలోని కార్యాలయం నుంచే పనిచేయాలని నిర్ణయించుకున్నారు.
గుంటూరు : రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు పులిచింతల వద్దే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీల వరకే నీటిని నిల్వ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
విశాఖ: విజయవాడ కేంద్రంగా రాకపోకలు సాగించే 241 రైళ్లు పూర్తిగా, మరో 215 రైళ్లు దారి మళ్లిస్తున్నామని, 361 రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల కారణంగా ఈ నెల 20 నుంచి 28 వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఉంటుందని ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
కర్నూలు: డోన్ మండలంలోని మల్లేపల్లెలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి మిద్దెకూలి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతితో ఆ ఇంట విషాదం అలముకుంది.
విశాఖ: ఆంధ్రా యూనివర్సిటీలోని మమతా వసతిగృహంలో గురువారం తెల్లవారుజామున కిటికీకి ఉరేసుకుని న్యాయ విద్యార్థి యశస్వి ఆత్మహత్య చేసుకున్నాడు. యశస్వి స్వగ్రామం గుంటూరు జిల్లా చిలకలూరిపేట. వ్యసానాలకు బానిస అయినందున మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
నంద్యాల, సెప్టెంబర్ 14: గ్రామాన్ని నాశనం చేసే కెమికల్ ఫ్యాక్టరీ మాకొద్దంటూ కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొండజూటూరు గ్రామస్తులు ముక్తకంఠంతో నినదించారు. అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులు, ఫ్యాక్టరీ యజమానిని అడ్డుకున్నారు. నీళ్లట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హె చ్చరించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాళ్లు, కుర్చీలు విసిరారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
శ్రీశైలం, సెప్టెంబర్ 14: శ్రీశైలంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియ విరిగి పడింది. లింగాలగట్టులోని పెద్దబ్రిడ్జి వద్ద కొండచరియ విరిగి ఓ పెద్దరాయి పడడంతో ఇంటి పైకప్పు ధ్వంసమైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లింగాలగట్టులోని కొండచరియలు నాని బండరాళ్లు కిందికి దొర్లుతున్నాయి.
విజయవాడ, సెప్టెంబర్ 14: కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలతో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందగలదని, అసలు ఇంతకంటే మేలైన ప్యాకేజీలు ఉండబోవని, హోదావల్ల ఒనగూడే దానికంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు.ఈ రాష్ట్రానికి చెందిన ఎంపి కాకపోయినా రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎంతగానో తహతహలాడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును నిందిస్తుంటే ఈ రాష్ట్రాని
విజయవాడ, సెప్టెంబర్ 14: వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు పల్నాడును వదిలి వేరే ప్రాంతాలకు వలసపోతున్నారు. సాగర్ జలాశయం నుంచి నీరు విడుదల కాకపోవడంతో వ్యవసాయం దుర్భరమైపోయింది. పంటలు పండక, పశువులను పోషించలేక ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. పల్నాడులోని వివిధ మండలాల్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో 35వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
విశాఖపట్నం, సెప్టెంబర్ 14: భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ సేవల విరామం అనంతరం మ్యూజియంగా మార్చేందుకు ఎపి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా నగరంలో బుధవారం ఆయన తూర్పునౌకాదళం ప్రధానాధికారి హెచ్సిఎస్ బిస్త్తో కొద్దిసేపు చర్చించారు.