S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/17/2016 - 17:52

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి ఎపిలో విలీనం అయిన మండలాల్లో టీచర్ల నియామకానికి ప్రత్యేక డిఎస్సీ నిర్వహించనున్నారు. ఈ మండలాల్లో 309 గిరిజన టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు విడిగా డిఎస్సీ పరీక్ష జరపాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించి, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

02/17/2016 - 17:52

విజయవాడ: గతంలో ఎంపీగా ఉన్నపుడు లోక్‌సభలో నోరుమెదపని వైఎస్ జగన్ ఇపుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎపి సమాచార, ఐటీ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, నీచ రాజకీయాలు చేస్తున్న జగన్ ఎపికి నిధులు రాకుండా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

02/17/2016 - 17:51

హైదరాబాద్: ఎపి అసెంబ్లీ నుంచి తనను ఏడాదికాలం పాటు సస్పెండ్ చేయడం అన్యాయం అని, దీనిపై ‘స్టే’ ఇవ్వాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యే రోజా చేసిన అభ్యర్థనను ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు బుధవారం త్రోసిపుచ్చింది. అయితే, రోజా దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి, ఎపి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

02/17/2016 - 17:24

హైదరాబాద్:తుని ఘటనకు సంబంధించి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైకాపాపై నిందలు మోపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇప్పుడు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ ఆరోపించారు. బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలసి ఫిర్యాదు చేసిన జగన్ ఆ తరువాత మీడియాతో మాట్లాడారు.

02/17/2016 - 16:36

న్యూదిల్లి:జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు, దేశద్రోహం నేరంపై అరెస్టయిన కన్నయ్యకుమార్‌పై కొందరు న్యాయవాదులు పాటియాలా కోర్టువద్ద దాడి చేశారు. అలా చేసినందుకు గర్వపడుతున్నామంటూ వారు పోలీసులతో చెప్పారు. మరోవర్గం న్యాయవాదులు కన్నయ్యకుమార్‌కు అనుకూలంగా నినాదాలు చేయగా వ్యతిరేకంగా మరికొందరు న్యాయవాదులు నినాదాలు చేశారు. తాజా సంఘటనలో ఓ జర్నలిస్టు స్వల్పంగా గాయపడ్డారు.

02/17/2016 - 12:09

తిరుపతి: ఇక్కడి అన్నారావు జంక్షన్ సమీపంలో ఓ మురుగు కాల్వలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించడంతో కలకలం చెలరేగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, గాలింపు చర్యలు చేపట్టగా బాంబు పేలుడుకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. ఎవరైనా బాణాసంచా పేల్చి ఉంటారని అనుమానిస్తున్నారు. బాంబు స్క్వాడ్‌తో సమీప ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా గాలించారు.

02/17/2016 - 12:08

అనంతపురం: నగరంలో ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఇంటర్ సెకండియర్ విద్యార్థి బాలూ నాయక్‌ను బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బహిర్భూమికి వెళ్లిన విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు దాడిచేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానికులు ఆసుపత్రికి వెంటనే తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

02/17/2016 - 12:07

ఏలూరు: వివిధ స్కీముల పేరిట వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి డిపాజిట్‌గా సేకరించి వంచించిన కేసులో అగ్రిగోల్డ్ చైర్మన్ ఎ.వి.రామారావు, ఎం.డి. శేషు నారాయణరావులను సిఐడి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ నిమిత్తం రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఈ ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి ఆమోదించారు.

02/17/2016 - 12:06

విశాఖ: నగరంలోని మెరైన్ పోలీస్‌స్టేషన్‌లో సిఐగా పని చేస్తున్న హుస్సేన్ ఆస్తులపై ఏసిబి అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎండాడ, చేపల ఉప్పాడ, పెందుర్తి, రాజమండ్రి, బెంగుళూరు సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఆయనకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన భాగస్వామిగా ఉన్నట్లు ఏసిబి డిఎస్పీ రామకృష్ణ తెలిపారు.

02/17/2016 - 12:04

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాపరిపాలనకు సంబంధించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి బుధవారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం సచివాలయ భవనాలను నాలుగు నెలల్లోగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి భూములను ఇచ్చిన రైతులను ఆయన అభినందించారు.

Pages