S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 01:30

తిరుపతి, జూలై 4: చిల్లర నాణేలు, పాత నోట్ల పరకామణికి త్వరలో నూతన భవనం నిర్మిస్తున్నట్లు టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం పరకామణి సేవలో ఇఓ పాల్గొన్నారు.

07/05/2016 - 01:27

శ్రీకాళహస్తి, జూలై 4: శ్రీకాళహస్తీశ్వరాలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. అమావాస్యకావడంతో తెల్లవారుజాము నుంచే రద్దీ మొదలైంది. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి, రాహు-కేతు పూజలు చేయించుకోవడానికి భక్తులు ఒక్కసారిగా రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇటీవల ఇఓ భ్రమరాంబ లోపల క్యూలైన్లను మార్పులు చేయడం వల్ల భక్తులు క్యూలైన్లలోకి వెళ్లలేకపోయారు.

07/05/2016 - 01:26

తిరుపతి, జూలై 4: గత కొంత కాలంగా స్పాండిలైటిస్ వ్యాధితో బాధపడుతూ బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు మాదాల రంగారావు ఆరోగ్యం కుదుట పడిందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు తెలిపారు. బర్డ్‌లో ఉన్న మాదాల రంగారావును సిపిఐ నేతలు పరామర్శించారు.

07/05/2016 - 01:25

తిరుపతి, జూలై 4: తిరుపతి నగర పాలక సంస్థలోని శివజ్యోతి నగర్‌లో కాలువ నిర్మాణాలు చేపట్టకపోవడంతో స్థానిక ప్రజలు గత ఎంతో కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మీరైనా సమస్యలు పరిష్కరించాలని రాయలసీమ పోరాటసమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి నేతృత్వంలో సోమవారం నగర పాలక సంస్థ కమిషనర్ వినయ్‌చంద్‌కు కాలనీ వాసులు విజ్ఞప్తిచేశారు.

07/05/2016 - 01:24

చిత్తూరు, జూలై 4: కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సంఘటన సోమవారం చోటు చేసుకొంది. ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగడం ఆనవాయితీ, ఈ క్రమంలో ఎస్ ఆర్ పురం మండలం పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన క్రిష్ణయ్య (41) ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు.

07/05/2016 - 01:24

వెదురుకుప్పం, జూలై 4: మండలంలోని బాలుపల్లికి భాస్కర్‌రెడ్డి అనే రైతు టిప్పర్ బోల్తా పడటంతో గాయపడి మంగళవారం మృతిచెందాడు. మృతుడు వ్యవసాయ పనుల నమిత్తం ట్రాక్టర్ తోలుతూ వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కర్‌రెడ్డి ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. భాస్కర్‌రెడ్డికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే నారాయణ స్వామి పరామర్శించారు.

07/05/2016 - 01:23

తిరుపతి, జూలై 4: ట్రాన్స్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అప్పయ్యదొర పదవీ కాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2013 ఆగస్టు 30న ట్రాన్స్‌కో సిఎండిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లుగా సిఎండిగా కొనసాగేందుకు ప్రభుత్వం అప్పుడు ఉత్తర్వులు జారీచేసింది.

07/05/2016 - 01:23

తిరుపతి, జూలై 4: స్విమ్స్ పద్మావతి మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా, మెడికల్ సూపరింటెండెంట్లుగా, సూపర్ స్పెషాలిటీ బ్రాడ్ స్పెషాలిటీస్‌లో ఉద్యోగులుగా నియామకాలు చేపడుతున్నట్లు స్విమ్స్ డైరెక్టర్, వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 118 పోస్టులను భర్తీచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

07/05/2016 - 01:21

కడప,జూలై 4: జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కడప ఆఫీసర్స్‌క్లబ్‌లో వార్షిక జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ధృడ సంకల్పంతో ఉందన్నారు. కడప జిల్లాను రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా అన్ని సౌకర్యాలు ఉన్న క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తామన్నారు.

07/05/2016 - 01:21

చక్రాయపేట, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం అందరికీ నిత్యావసర సరుకులు అందాలనే ఉద్దేశ్యంతో బయోమెట్రిక్ విధానం ద్వారా చేపట్టిన ఈ పాస్ యంత్రాల ద్వారా రేషన్‌కార్డుల్లో చాలా పేర్లు తొలగించబడినది. ఆధార్ అనుసంధానం చేయడంతో అధికారుల తప్పుదారుల వలన వేలాది పేర్లు తొలగించడంతో రేషన్‌కార్డు వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

Pages