S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఏలూరు, జూలై 4: జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు కేటాయించిన సిబ్బందికి వేరే పనులు అప్పచెప్పి వారిని తీయటంగాని చేస్తే హెచ్ఓడిల మీద చర్య తీసుకుంటామని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అన్నారు.
ద్వారకాతిరుమల, జూలై 4: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా గడచిన 28 రోజులకు గాను 1.91 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. సోమవారం ఆలయ హుండీల లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి నగదు రూపేణా 1,91,03,478 రూపాయల నగదు లభించినట్లు ఆలయ ఇఒ వేండ్ర త్రినాధరావు తెలిపారు.
వేలేరుపాడు, జూలై 4: పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులుగా మారే తమకు సమన్యాయం జరుగకుంటే నివాసిత ప్రాంతాలను ఖాళీ చేసే ప్రసక్తే లేదని నిర్వాసిత రైతాంగం సోమవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఏలూరు, జూలై 4: జిల్లాలో 5,10 రూపాయల వడ్డీలతో ప్రజలను దోపిడి చేసే కాల్మనీ వ్యాపారులను అరెస్టు చేసి బాధితులకు ఉపశమనం కల్పించాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్లో సోమవారం మీ-కోసం కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులను ఆయన స్వీకరించారు.
హైదరాబాద్, జూలై 4: ఈ నెల 8నుండి రాష్టవ్య్రాప్తంగా ప్రారంభం కానున్న తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో ఒక ఉద్యమంలాగ చేపట్టి విజయవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు.తెలంగాణకు హరిత హారం పై మంత్రులు జోగురామన్న, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, హరీష్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మలతో కలిసి సోమవారం సచివాలయంనుండి జ
వికారాబాద్: వాతావరణ సమతుల్యతను కాపాడేవి చెట్లను అందుకే మొక్కలు నాటాలని ఎక్సైజ్ సూపరిండెంటెంట్ పి.దశరథం అన్నారు. సోమవారణ హరితహారంలో భాగంగా వికారాబాద్ మండలం సిద్దులూర్ గ్రామంలో పాపయ్య పొలంలో ఈతమొక్కలను నాటారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ శాఖ తరఫున ఈత. ఖర్జూర మొక్కలు అందిస్తున్నామని చెప్పారు.
శేరిలింగంపల్లి: కాలుష్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అప్పారావు అన్నారు. సోమవారం డొయన్స్ కాలనీలోని విద్యాంజలి హైస్కూల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్తో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఎల్బినగర్, జూలై 4: ఉమ్మడిగా ఉన్న హైకోర్టును విభజించడంతోనే తెలంగాణ న్యాయాధికారులకు, న్యాయవాదులకు న్యాయం చేకూరుతుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
హైదరాబాద్, జూలై 4: ఇరాన్లోని చారిత్రక నగరమైన ఎస్ఫాహన్ సిటీ ప్రతినిధుల బృందం సోమవారం మేయర్ బొంతు రామ్మోహన్ను అధికారికంగా ఆయన చాంబర్లో కలిసింది. హైదరాబాద్, ఎస్ఫాహన్ నగరాల మధ్య సిస్టర్ సిటీ ఒప్పందాన్ని కుదుర్చుకుందామని, ఇందుకు మేయర్ తగు సమయాన్ని కేటాయించాలని కోరింది.
అల్వాల్, జూలై 4: నగరంలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం హత్య కేసులో నిందితుడు అనిల్ని అరెస్టు చేసి నిర్భయ కేసు పెట్టినట్లు నార్త్జోన్ డిసిపి సుమతి చెప్పారు. సోమవారం నార్త్ జోన్ డిసిపి కార్యాలంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుడు చింతకింద అనిల్ ను ప్రవేశ పెట్టి నిందితునికి సంమందించిన నేర చరిత్ర వివరాలు తెలిపారు.