S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నంద్యాల, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత వాగ్ధానాలతో, కల్లబొల్లి మాటలతో రాయలసీమ వాసులకు ద్రో హం చేయడం తగదని, సీమ ప్రాంతానికి కేటాయించిన నీటిని సీమ వాసులకు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో రాయలసీమ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి హెచ్చరించారు.
కర్నూలు సిటీ, జూలై 4:ఐటి కంపెనీలు అమరావతిలో ఏర్పాటు చేస్తూ, విషపూరిత వాయువులు వెదజల్లే పరిశ్రమలను రాయలసీమలో ఏర్పాటు చేయటం ఏంటని రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సిఎం చంద్రబాబును ప్రశ్నించారు.
పాములపాడు, జూలై 4:పుష్కరాల పను ల్లో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, 24 గంటల పాటు పనులు చేయటానికి ఆల యం వద్ద సోలార్ లైట్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. కపిలేశ్వరం వద్ద అటవీ శాఖ నిలిపివేసిన పుష్కరాల రోడ్డు పనులకు ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ లభించింది.
కర్నూలు సిటీ, జూలై 4:కృష్ణా పుష్కరాల పనుల్లో అధికార పార్టీ నాయకులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఎంఎ.గఫూర్ విమర్శించారు. నగరంలోని సుందరయ్య భవన్లో సోమవారం పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.
మంత్రాలయం, జూలై 4: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో సోమవారం అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఉంచి మఠం ప్రాకారంలో ఘనంగా ఊరేగించారు.
ఖమ్మం(కల్చరల్): పలు రకాల కానె్సప్ట్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై టిపిఇఆర్ఎం, కెడిపిఎ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం స్థానిక న్యూవిజన్ పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా దాదాపు 5 గంటల పాటు సాగింది.
రుద్రంపూర్, జూలై 4: గిరిపుత్రులు పుడమితల్లి కోసం పోరుబాట పట్టారు. పొట్టకూటి కోసం పోడు చేసుకుంటున్న అమాయక ఆదివాసీల పట్ల రాష్ట్రప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోంది. రెక్కలు ముక్కలు చేసుకుని సాగుచేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు పాశవిక దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆదివాసీలపై అక్రమంగా కేసులు పెట్టడంతోవారు ఆందోళనకు గురవుతున్నారు.
ఖానాపురం హవేలి/ఖమ్మం(కల్చరల్)/ఖమ్మం(ఖిల్లా) జూలై 4: ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం నగరంలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయ. వివరాల్లోకి వెళితే ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని, పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జాగర్లమూడి రంజిత్కుమార్ డిమాండ్ చేశారు.
ఖమ్మం, జూలై 4: ఈ ఏడాది ప్రపంచ మార్కెట్లో పత్తికి గిరాకీ ఉండదని, గిట్టుబాటు ధర వచ్చే అవకాశం లేదని, ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపాలని ప్రభుత్వం, అధికారులు చెప్పినా రైతులు మాత్రం పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయం పేరుతో ప్రతి ఏడాది సాగు అయ్యే పత్తి విస్తీర్ణం కంటే కనీసం 30శాతమన్నా తగ్గించాలనుకున్న అధికారుల శ్రమ వృధా అయింది.
ఖమ్మం(గాంధీచౌక్), జూలై 4: ద్విచక్రవాహనాదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను పోలీస్ అధికారులు పటిష్టంగా అమలు చేస్తుండటంతో ఆర్టీవో కార్యాలయాల్లో అధికారులు హెల్మెట్ ఉంటేనే వాహన రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.