S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 14:34

శ్రీనగర్: హంద్వారా ఘటన అనంతరం కాశ్మీర్‌లో పలు చోట్ల ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంని. భద్రతాదళ సిబ్బంది శుక్రవారం జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడంతో వేర్పాటువాద ఉద్యమ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్రిక్తత చల్లారక పోవడంతో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగిస్తూ, ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు.

04/16/2016 - 14:33

తిరుపతి: తిరుపతి బస్టాండ్ నిర్వహణ తీరు అధ్వాన్నంగా ఉందని ఆర్టీసీ ఎండి సాంబశివరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఇక్కడి బస్ కాంపెక్సును శనివారం పరిశీలించి, విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ, విశాఖ బస్‌కాంప్లెక్సుల మాదిరి తిరుపతి బస్టాండ్‌ను తీర్చిదిద్దాలన్నారు.

04/16/2016 - 14:33

అనంతపురం: ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తన స్వగ్రామైన నీలకంఠాపురంలో శనివారం నాడు 42 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో వేడుకలు ముగిశాక ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరవు ప్రాంత ప్రజలను కొంతమేరకు ఆదుకునేందుకు సామూహిక వివాహాలను జరిపించినట్లు ఆయన తెలిపారు.

04/16/2016 - 14:33

అనంతపురం: అనంతపురం జిల్లాకు దక్కాల్సిన హంద్రీనీవా ప్రాజెక్టు జలాలను చిత్తూరు జిల్లా కుప్పంకు తరలించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైకాపా, కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, మానవహక్కుల సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ హంద్రీనీవా జలాలపై చిత్తూరు జిల్లాకు ఎలాంటి హక్కూ లేదన్నారు.

04/16/2016 - 14:32

కడప: రైల్వేకోడూరు సమీపంలో శనివారం ఉదయం పోలీసులు దాడులు చేసి సుమారు కోటిన్నర రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 15 మంది కూలీలను అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక ట్రక్కు, నాలుగు బైక్‌లు, నాలుగు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

04/16/2016 - 14:32

విశాఖ: తమపై దేవాదాయశాఖ అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నందుకు నిరసనగా ఈ నెల 27 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను మూసివేస్తామని అర్చకుల సంఘం నేతలు హెచ్చరించారు. అనేక ఆలయాల్లో అర్చకులకు నిత్యం వేధింపులు, తప్పుడు కేసులు తప్పడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

04/16/2016 - 14:32

అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం వడదెబ్బకు గురై ఇద్దరు మహిళలతో పాటు ఓ మధ్య వయస్కుడు ప్రాణాలు కోల్పోయారు.

04/16/2016 - 14:31

కాకినాడ: రోడ్డుపై ఆగిఉన్న లారీని ఓ వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు మరణించిన ఘటన అన్నవరం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు వ్యాన్ డ్రైవర్‌ను అరెస్టు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

04/16/2016 - 14:31

ఆగ్రా: బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ శనివారం సాయంత్రం 4 గంటలకు ఇక్కడి తాజ్‌మహల్ కట్టడాన్ని వీక్షించేందుకు వస్తున్న సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విలియం దంపతులు బస చేసే హోటల్ వద్ద, తాజ్‌మహల్ పరిసరాల్లో అణువణువూ గాలించారు. 24 ఏళ్ల క్రితం విలియం తల్లి డయానా తాజ్‌మహల్‌ను సందర్శించారు.

04/16/2016 - 14:30

ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఎపి సిఎం చంద్రబాబు శనివారం సింగరాయకొండలో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను ఆరా తీశారు. అనంతరం ఆయన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ జలవనరులను సంరక్షించేందుకు దీక్ష వహించాలన్నారు.

Pages