S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 07:21

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఉగ్రవాదం, వాతావరణ మార్పు, అసమానతలు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లని పేర్కొంటూ, మహావీర్ జైన్ ప్రవచించిన మూడు సూత్రాలు అహింస, అనేకాంత్ (్భన్నత్వంలో ఏకత్వం), అపరిగృహ (పరిత్యాగం)లు ఈ మూడు సవాళ్లకు పరిష్కారాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు.

04/16/2016 - 07:21

రనాఘాట్, ఏప్రిల్ 15: ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పోలీసు అధికారులను బదిలీ చేసినా ప్రస్తుత ఎన్నికల్లో తమ పార్టీ విజయావకాశాలు ఎంత మాత్రం తగ్గవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌కు తన ధిక్కార స్వరాన్ని మరింత పదునుగా వినిపించిన మమత‘నేను ఏమి చేయలనుకుంటే అదే చేస్తాను. ఎలా మాట్లాడలనుకుంటే అలాగే మాట్లాడతాను’అని తీవ్ర స్వరంతో అన్నారు.

04/16/2016 - 07:20

చెన్నై, ఏప్రిల్ 15: తమిళ జాలర్ల విషయంలో డిఎంకె అధినేత కరుణానిధి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. కచ్చతీవుదీవువిషయంలో కోర్టుకు వెళ్లకుండా దాన్ని శ్రీలంకకు అప్పగించిన పాపం కరుణదేనని, ఆ విషయంలో భారత్ ప్రభుత్వానికి ఆయన అన్ని విధాలుగా సహకరించారని జయ ధ్వజమెత్తారు.

04/16/2016 - 07:20

ఇస్లామాబాద్, ఏప్రిల్ 15: భారత్‌తో శాంతి చర్చలు నిలిచిపోయాయన్న వాదనను పాకిస్తాన్ తిరస్కరించింది. ఇరుదేశాల మధ్య మొదలైన శాంతి ప్రక్రియ మొదలవుతుందని ఇందుకు సంబంధించి తాము భారత్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని పాక్ వెల్లడించింది. అన్ని రకాలుగానూ పరిస్థితులను చక్కదిద్దేందుకు ముందుకు వెళ్లాలే తప్ప అవకాశాలను జారవిడుచుకోకూడదని పాక్ విదేశాంగ కార్యాలయం స్పష్టం చేసింది.

04/16/2016 - 07:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశ రాజధానిలో కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రెండోదశ సరి బేసి నియమం శుక్రవారం నుండి ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. రాజధాని రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించాలని, కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో గతంలో ఈ సరిబేసి విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది.

04/16/2016 - 07:11

ఇపో (మలేసియా), ఏప్రిల్ 15: ప్రతిష్టాత్మకమైన సుల్తాన్ అజ్లన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు టైటిల్ పోరుకు సిద్ధమైంది. తప్పక గెలవాల్సిన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో భారత్ శుక్రవారం ఇక్కడ ఆతిథ్య మలేసియా జట్టును 6-1 గోల్స్ తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు చేరడం ఇది ఏడోసారి.

04/16/2016 - 07:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పెద్ద షేర్లతో పోల్చితే చిన్న షేర్లు ఈ ఏడాది అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మదుపరుల ఆదరణకు నోచుకోక స్మాల్-క్యాప్ సూచీ ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటిదాకా 7.5 శాతం క్షీణించింది. ఇదే సమయంలో మిడ్-క్యాప్ సూచీ కేవలం 2 శాతం పడిపోవడం గమనార్హం. బ్లూచిప్ సూచీ సైతం 1.87 శాతం మాత్రమే కోల్పోయింది.

04/16/2016 - 07:03

బెంగళూరు, ఏప్రిల్ 15: దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో అంచనాలను మించి లాభాలను అందుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చితో పోల్చితే 16.2 శాతం వృద్ధితో 3,597 కోట్ల రూపాయల ఏకీకృత నికర లాభాన్ని పొందింది. పోయినసారి 3,097 కోట్ల రూపాయల లాభంతోనే సరిపెట్టుకుంది.

04/16/2016 - 07:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు బాకీపడి లండన్ వెళ్లిపోయిన కింగ్‌ఫిషర్ అధినేత, మద్యం దిగ్గజం విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. దేశంలోని బ్యాంకులకు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మాల్యా బ్రిటన్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా పాస్‌పోర్టును ప్రభుత్వం శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసింది.

04/16/2016 - 07:02

సెంటినరికాలనీ, ఏప్రిల్ 15: దేశంలో ఉన్న భూగర్భ గనులు కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్‌లోని అడ్రియాల గనిని ఆదర్శంగా తీసుకోవాలని కోల్ ఇండియా అనుబంధ విభాగం, రాంచీకి చెందిన కోల్‌మైన్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఇనిస్టిట్యూషన్ (సిఎంపిడిఐ) సిఎండి శేఖర్ శరణ్ అన్నారు.

Pages