S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రముఖ నటుడు పవన్కళ్యాణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఆయన చేసిన సినిమాలు 20 దాటలేదు. అంటే ఏడాదికొక సినిమా చొప్పున చేస్తూ వస్తున్నాడు. అయితే, వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళతానని, సినిమాలు మానేస్తానని చెబుతున్న పవన్, ఈ మూడేళ్ల గ్యాప్లో మహా అయితే రెండో మూడో సినిమాలు చేస్తాడని అంటున్నారు అందరూ. కానీ, ఆయన సినిమాల విషయంలో స్పీడు పెంచినట్టు కనిపిస్తోంది.
శ్రీకాంత్, నిఖిత జంటగా కరణం బాబ్జి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెంటల్ పోలీస్’. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా ప పాల్గొని ట్రైలర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘్భన్నమైన పాత్రల్లో నటిస్తూ ముఖ్యంగా పోలీసు పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచాడు శ్రీకాంత్.
బాలీవుడ్ అందాలతార ఐశ్వర్యరాయ్ పింక్కలర్ దుస్తుల్లో మెరిసిపోయింది. ముంబైలో జరిగిన సరబ్జిత్ చిత్రం
ట్రెయిలర్ను విడుదల చేసిన ఆమె అయిషా రమదన్ రూపొందించిన డ్రెస్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదే సినిమాలో సరబ్జిత్ సతీమణిగా నటిస్తున్న రిచాచద్దా, ప్రఖ్యాత డిజైనర్లు గౌరి-నైనికసేథ్ రూపొందించిన దుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో ఆహూతులను అలరించారు.
జీవితంపట్ల ఎన్నో ఆశలతో గల్ఫ్కు వలస వెళ్లిన భారతీయుల కష్టసుఖాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గల్ఫ్’. పి.సునీల్కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రచారాన్ని విభిన్నంగా ప్లాన్ చేశారు. అందులో భాగంగా గల్ఫ్లోని వివిధ ప్రాంతాల్లో పాటలను, టీజర్ను విడుదల చేస్తున్నారు.
రైతు రామయ్య తాను పొలం పనులకు వాడుకొనే పరికరాలన్నింటినీ ఒక రేకుల షెడ్లో ఉంచుతాడు. ఒకరోజున రామయ్య భార్య సూరమ్మ గబగబా ఆ రేకుల షెడ్లోకి వచ్చి అక్కడ గుచ్చి ఉంచిన సూదిని తీసుకెళ్లి రామయ్య చిరిగిన పంచె కుట్టి, తిరిగి దాన్ని షెడ్డులో భద్రపరచింది. ఆమె వెళ్లాక సూది పక్కనే అలమరాలో ఉన్న దబ్బనం కేసి చూసి ‘బద్ధకపు దబ్బనమా? చూశావా? నేను మన యజమాని కెంత సేవ చేస్తున్నానో?
హైదరాబాద్: నచ్చిన కారును కొనడమే కాదు, దానికి ఫ్యాన్స్ నెంబర్ తెచ్చుకునేందుకు సెలబ్రిటీలు ఎంత డబ్బయినా ఖర్చు చేస్తారని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరోసారి నిరూపించాడు. ఇటీవల తాను మోజు పడి కొనుక్కున్న బీఎండబ్ల్యు కారుకు 10.5 లక్షల రూపాయలను చెల్లించి వేలంలో ‘టిఎస్ 09 ఇఎల్ 9999’ నెంబర్ను ఆయన దక్కించుకున్నాడు. ఈ నెంబర్ కోసం పలువురు పోటీ పడగా బహిరంగ వేలంలో తనదే పైచేయి అని ఆయన నిరూపించుకున్నాడు.
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త కార్యవర్గాన్ని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తమకుమార్ రెడ్డి టి.పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, కార్యవర్గంలో 31 మంది ప్రధాన కార్యదర్శులను, 13 మంది ఉపాధ్యక్షులను, 35 మంది ఇసి మెంబర్లను, 22 మంది శాశ్వత ఆహ్వానితులను, సమన్వయ కమిటీలో 31 మందిని నియమించారు.
విజయవాడ: కృష్ణానది పుష్కరాలు సమీపిస్తున్నందున వివిధ పనులను పూర్తి చేసేందుకు ఎపి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో నదీ తీరం వెంబడి బారికేడ్ల నిర్మాణానికి 9.5 కోట్లు, అతిథిగృహాలు, ప్రభుత్వ బంగ్లాల ఆధునీకరణకు ఆరు కోట్ల రూపాయలను విడుదల చేశారు.
నెల్లూరు: ఇక్కడి బైపాస్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం వేగంగా దూసుకొచ్చన లారీ ఓ స్కూటీని ఢీకొనడంతో ఎల్ఐసి ఏజెంటుగా పనిచేస్తున్న ఓ మహిళ దుర్మరణం పాలైంది. భారీ వాహనాలను నియంత్రించనందునే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం: బొబ్బిలి రాజవంశానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే సుజయకృష్ణ, ఆయన సోదరుడు బేబీనాయన ఈనెల 20న తెలుగుదేశంలో పార్టీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 20న సిఎం చంద్రబాబు జన్మదినం కావడంతో అదే రోజున బొబ్బిలి రాజులు టిడిపిలో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.