S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 08:11

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 15: రాష్ట్రంలో ఇసుక సమృద్ధిగా లభించే ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా. గోదావరి నది ఇసుకకు నిర్మాణ రంగంలో మరింత డిమాండ్ ఉంది. ఇక్కడ ఇసుక గతంలో నౌకలపై విదేశాలకు సైతం ఎగుమతైంది. ఇదికాస్త పక్కన పెడితే... ఉచిత ఇసుక విధానం మాఫియా చేతిలోకి వెళ్లిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదొక సదవకాశంగా పరిణమించిందని తెలుస్తోంది.

04/16/2016 - 07:39

ఖమ్మం, ఏప్రిల్ 15: చలువ పందిళ్ళలో అశేష భక్తజనం తదేకంగా కళ్లప్పగించి చూస్తుండగా వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ఖమ్మం జిల్లా భద్రాచలంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటీవలే నూతన స్వర్ణకవచ ధారులైన ఉత్సవమూర్తులకు కల్యాణం విశేషంగా జరిపించారు. వేదమంత్రాల మధ్య జగదభిరాముడు సీతమ్మ వారి మెడలో జనక, దశరథ, రామదాసులు తయారు చేయించిన మూడు మంగళసూత్రాలతో మాంగల్యధారణ చేశారు.

04/16/2016 - 07:36

కడప, ఏప్రిల్ 15: రెండవ భద్రాద్రిగా వాసికెక్కిన కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమం టిటిడి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకువచ్చారు.

04/16/2016 - 07:34

హైదరాబాద్/ఆల్వాల్, ఏప్రిల్ 15: ప్రపంచ దేశాలకు మన నాగరికతను తెలియజేసే విధంగా మనం మెలగాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ చైర్మన్ జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్ వ్యాఖ్యానించారు. సద్గురు శివానంద మూర్తి ఆశీస్సులతో సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం సికిందరాబాద్ టివోలీ గార్డెన్స్‌లో శ్రీరామనవమి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభ జరిగింది.

04/16/2016 - 07:33

నాసిక్, ఏప్రిల్ 15: ఆలయ ప్రవేశంలో స్ర్తి పురుష సమానత్వం పాటించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిరోజూ గంటసేపు గర్భగుడిలోకి మహిళలను అనుమతించాలని మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకేశ్వర దేవస్థానం ట్రస్టు నిర్ణయించింది. అయితే గర్భగుడిలో పూజలు చేసేటప్పుడు వారు తడి నూలు వస్త్రాలు లేదా పట్టు వస్త్రాలు ధరించాలని షరతు పెట్టింది.

04/16/2016 - 07:32

హైదరాబాద్, ఏప్రిల్ 15: ‘్భరత్ మాతాకీ జై అనకపోతే మజ్లిస్ సంగతిని ధూల్‌పేట వాసులే చూసుకుంటారు..’ అని బిజెపి ఎంపి సాక్షిమహారాజ్ హెచ్చరించారు. ధూల్‌పేటలో గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ఏర్పాటు చేయించిన భారీ శ్రీవీరాంజనేయ స్వామి విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు సాక్షిమహారాజ్ వచ్చారు.

04/16/2016 - 07:31

హైదరాబాద్, ఏప్రిల్ 15: హిందూ సంప్రదాయాల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం సరైన విధానం కాదని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర అన్నారు. శుక్రవారం ఇక్కడ ఫిల్మ్‌నగర్‌లో దైవ సన్నిధానం వద్ద సీతారాముల కళ్యాణం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో ముచ్చటిస్తూ, సంప్రదాయాలను బట్టే మతం ఉంటుందన్నారు. శబరిమలలో వృద్ధులైన మహిళలు, బాలికలకు ప్రవేశం ఉందన్నారు.

04/16/2016 - 07:25

వెల్లింగ్టన్, ఏప్రిల్ 15: యుద్ధాల్లో తుది విజయం సాధించడానికి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడానికి త్రివిధ దళాల మధ్య పూర్తి సమన్వయం అవసరమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు.

04/16/2016 - 07:22

శ్రీనగర్, ఏప్రిల్ 15: జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా శుక్రవారం ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఆందోళనకారులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో నలుగురు గాయపడ్డారు. మృతి చెందిన విద్యార్థి 11వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఉత్తర కాశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైంది.

04/16/2016 - 07:22

ముంబయి, ఏప్రిల్ 15: రెండు వేల సంవత్సరాలకు పైగా చైనాపై భారత్ సాంస్కృతికంగా ఆధిపత్యం చెలాయించిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఒక్క సైనికుడ్ని కూడా పంపకుండా సముద్రా మార్గాల ద్వారానే ఈ ఘనతను భారత్ సాధించిందని మారిటైమ్ శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా రాజ్‌నాథ్ పేర్కొన్నారు. శుక్రవారం ఈ సదస్సులో మాట్లాడిన ఆయన గంగానదీ తలాలే నాగరిక ఆలోచనలకు పుట్టినిల్లని అన్నారు.

Pages