S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 14:30

విజయవాడ: దివంగత నేత ఎన్టీఆర్ అలనాడు సేవాభావంతోనే తెలుగుదేశం పార్టీని ప్రారంభించారని, ఆయన చూపిన బాటలో పార్టీ శ్రేణులు ప్రజాసేవలో తరించాలని ఎపి సిఎం చంద్రబాబు సూచించారు. ఆయన శనివారం ఉదయం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సేవాభావంతోనే రాజకీయాల్లో కొనసాగాలని, వాణిజ్య దృక్పథంతో కాదని అన్నారు.

04/16/2016 - 14:28

ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఎపి సిఎం చంద్రబాబు శనివారం సింగరాయకొండలో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను ఆరా తీశారు. అనంతరం ఆయన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ జలవనరులను సంరక్షించేందుకు దీక్ష వహించాలన్నారు.

04/16/2016 - 12:43

జపాన్ : రెండు రోజులుగా సంభవిస్తున్న వరుస భూ ప్రకంపనలతో జపాన్ చిగురుటాకులా వణుకుతోంది. తాజాగా శనివారం తెల్లవారుజామున మరోసారి పలు చోట్ల భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.6గా నమోదైంది. రెండు రోజుల్లో దాదాపు 30 మంది మరణించగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోగా, భారీ భవనాలు బీటలు వారాయి. రోడ్లపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి.

04/16/2016 - 12:42

హైదరాబాద్: అర్ధరాత్రి వేళ అతివేగంగా కారును నడుపుతున్నందుకు కేంద్రమంత్రి సుజనాచౌదరి కుమారుడు సాయికార్తీక్‌పై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి తనిఖీల సందర్భంగా సాయికార్తీక్ కారును పోలీసులు ఆపి, మితిమీరిన వేగంగా వెళుతున్నందుకు కేసు పెట్టారు. కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

04/16/2016 - 12:42

విజయవాడ: మద్యం విషయమై ఇక్కడి సూర్యారావుపేట ప్రాంతంలో శనివారం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఓ నిండు ప్రాణం బలైంది. ఖమ్మం జిల్లాకు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి తలపై మరో వ్యక్తి బండరాయితో మోదాడు. దీంతో మల్లికార్జున్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

04/16/2016 - 12:41

విశాఖ: అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థికమండలి (సెజ్)లోని బ్రాండిక్స్ కంపెనీలో ఆందోళన చేస్తున్న మహిళా కార్మికులు శనివారం తమ నిరసన దీక్షను విరమించారు. జీతాల పెంపుదల, పిఎఫ్, ఇతర సౌకర్యాల విషయంలో హామీలను అమలు చేసేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు.

04/16/2016 - 12:44

హైదరాబాద్: ఆవేశంలో భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య పోలీసులకు లొంగిపోయిన ఘటన నగరంలోని నల్లకుంట ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగింది. గంగాధర్, విజయలక్ష్మి దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి. భర్త ప్రవర్తనతో విసిగిపోయినందునే కత్తితో ఆమె దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు.

04/16/2016 - 12:40

విజయవాడ: కృష్ణా జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకుని 8 లక్షల రూపాయల దొంగనోట్లను, 50 వేల నగదును, 3 బైక్‌లు, 18 సెల్‌ఫోన్లను శనివారం స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వీరు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా వీరు ఎపిలోకి ప్రవేశించి నకిలీ కరెన్సీని పలువురికి అంటగడుతున్నారు.

04/16/2016 - 12:40

మహబూబ్‌నగర్: నగదును దోచుకునేందుకు దొంగలు ఎస్‌బిహెచ్ ఎటిఎంను ధ్వంసం చేసిన సంఘటన పెబ్బేరులో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఎటిఎం యంత్రం తెరుచుకోనందున దొంగలు విధ్వంసం సృష్టించి పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుపై పోలీసులు ఎటిఎం కేంద్రాన్ని పరిశీలించి, దొంగల కోసం గాలిస్తున్నారు.

04/16/2016 - 12:38

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను శుక్రవారం రాత్రి ఇక్కడి లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Pages