-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
దిల్సుఖ్నగర్ : నగరంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతి గొంతు కోసి తాను ఆత్మహత్యా యత్నం చేశాడో ఉన్మాది. ఈ సంఘటన హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేష్ (24), హైదరాబాద్ బల్కంపేటకు చెందిన మనస్వి(22) దిల్సుఖ్నగర్లోని ఏస్ అకాడమీలో ఆర్ఆర్బీ కోచింగ్ తీసుకున్నారు.
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నాయన్న ఆరోణలతో హైదరాబాద్లోని జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ఇళ్లపై మంగళవారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్ కార్యాలయాలు, నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. గాంధీపై ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నట్టు కేసు నమోదు చేశారు.
ఝరాసంగం, జూలై 9: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఎలాగైనా ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు. అనుమానం రాకుండా దైవదర్శనానికి తీసుకువచ్చి ప్లాన్ ప్రకారం హత్య చేసి ప్రమాదంగా చిత్రికరించేందుకు యత్నించి చివరకు కటకటాల పాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం ఎస్సై ఏడుకొండల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలావున్నాయి.
భద్రాచలం టౌన్: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా డబ్బాకొంట దండకారణ్యంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మహిళా కమాండర్ కురాం భీమే హతమైంది. ఈమెపై రూ. 8లక్షల రివార్డు ఉంది. ఎన్కౌంటర్ ప్రదేశంలో పోలీసు బలగాలకు ఇన్సాస్ రైఫిల్ కూడా లభ్యమైంది. డబ్బాకొంట ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బలగాలను అక్కడికి పంపామని సుక్మా ఎస్పీ శలభ్ సింహా తెలిపారు.
విజయవాడ, జూలై 9: చీరాల శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ఎన్నికల కమిషన్కు అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కరణం బలరాం నాలుగో సంతానంగా అంబిక జన్మించిందనేందుకు ఆధారాలు ఉన్నాయన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్, జూలై 9: రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విజయవాడకు చెందిన కోగంటి సత్యం అనే వ్యాపారవేత్త ప్రమేయంతోనే రాంప్రసాద్ హత్య జరిగిందని టాస్క్ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. దీని వెనక మొత్తం ఎనిమిది మంది హస్తం ఉందని మంగళవారం ఇక్కడ తెలిపారు.
న్యూఢిల్లీ, జూలై 9: వివాదాస్పద అయోధ్య సమస్యను చర్చల ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ఓ ప్యానల్ ఏర్పాటైనప్పటికీ ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధ్యం కాలేదు.
న్యూఢిల్లీ, జూలై 9: వంశధార ట్రిబ్యునల్ విచారణ ఆగస్టు 27కు వాయిదా పడింది. గతంలో వంశధార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో స్పష్టత కోరుతూ ఒడిశా దాఖలు చేసిన అప్లికేషనను మంగళవారం జస్టిస్ ముకుందం శర్మ నేతృత్వంలోని ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. ఒడిశా తరపు న్యాయవాది జయంత్ భూషణ్, కత్పాలియా, రాధేశ్యాజేనాలు వాదనలు వినిపించారు. అలాగే ఏపీ తరపున ఈనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు.
హైదరాబాద్, జూలై 18: నగరంలో సంచలనం సృష్టించిన స్టీల్ వ్యాపారి తెల్లప్రోలు రాంప్రసాద్ హత్య కేసు కొత్త మలుపుతిరిగింది. రాంప్రసాద్ని తానే హత్య చేశానంటూ శ్యామ్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి కలకలం సృష్టించాడు. చోటూ, నరేష్తో కలిసి రాంప్రసాద్ను హత్య చేసినట్టు వెల్లడించాడు. కోగంటి సత్యం హత్య చేశారని హతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో తెరమీదకు శ్యామ్ రావడం గమనార్హం.
సూర్యాపేట, జూలై 8: విధులు ముగించుకొని అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరిన పోలీస్ కానిస్టేబుల్ను ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన జిలా లకేంద్రంలోని శంకర్విలాస్ సెంటర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగింది.