-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్ : టీవీ -9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను శుక్రవారం నాడు హైకోర్టు మంజూరు చేసిం ది. ఫోర్జరీ , నిధుల మళ్లింపు కేసులో నిందితుడిగా ఉన్న రవిప్రకాశ్ పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భావనతో హైకోర్టులో క్వాష్ పిటిషన్తోపాటు ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. వాటిపై గత కొద్ది రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ను మంజూరు చేసిం ది.
భద్రాచలం టౌన్, జూలై 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడిని దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం ఏజెన్సీలోని చర్ల మండలం బెస్తకొత్తూరు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.
కామారెడ్డి, జూలై 12: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో బస్సు కోసం వేచి కూర్చుని ఉన్న ప్రయాణికునిపైకి ప్లాట్ఫామ్ దాటి బస్సు దూసుకుని వచ్చి ఢీకొట్టడంతో ఒక ప్రయాణికుడు మరణించాడు. కామారెడ్డి ఎస్ఐ. గోవింద్ కథనం ప్రకారం కామారెడ్డి డిపోకు చెందిన ఏపీ 29జడ్ 3315 నంబర్గల ఎక్స్ప్రెస్ బస్సు బస్టాండ్లోని ప్లాట్ ఫామ్ నెంబర్ వన్ పైకి దూసుకుని వచ్చింది.
మహబూబాబాద్, జూలై 12: తొలి ఏకాదశి పండగను సంబరంగా జరుపుకుంటున్న ఆ కుటుంబం విషాదంలో మునిగి పోయింది.. అంతదాకా తమ కళ్లముందే ఆడుకున్న కన్నకొడుకులిద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లారనే వార్త ఆ కుటుంబాన్ని కలచివేసింది.. కుంటలో దిగి నీట మునిగి కంటిపాపాల్లా పెంచుకుంటున్న తమ చంటిబిడ్డల మరణంతో పండుగ పూట ఆ ఇంటి దీపాలు ఆరిపోయాయి.
హైదరాబాద్, జూలై 11: నగరంలోని అంబర్పేట్ డీడీ కాలనీలో ఓ పంజాబీ కుటుంబ సభ్యులంతా కూల్డ్రింక్లో నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో తండ్రి మృతి చెందగా, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా మారింది. అపస్మారక స్థితిలో ఉన్న వీరు దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యాయత్నానికి కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నారాయణఖేడ్ జూలై 11 వరకట్న వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తి భార్యను, కన్నకొడుకును హత్యచేసి అనంతరం కిరోసిన్ పోసి కాల్చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నాగల్గిద్దా మండలం కరసుగుత్తి గ్రామంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
వరంగల్, జూలై 11: అక్రమ వసూళ్లకు పాల్పడే వ్యక్తులకు తుపాకులు సరఫరా చేస్తున్న ముఠా వరంగల్ పోలీసులకు చిక్కింది. తుపాకితో బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడే ముఠాకు తుపాకులను సరఫరా చేసే ఆరుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్. దుగ్గొండి, గీసుకొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ముఠా సభ్యుల నుండి రెండు 9ఎంఎం రివాల్వర్లు, ఆరు బులెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చీమకుర్తి, జూలై 11: ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి ఒంగోలుకు వెడుతున్న ఆర్టీసీ బస్సు చీమకుర్తి మండలం తొర్రగూడిపాడు డొంక వద్ద ఉన్న చెట్టును ఢీకొట్టడంతో బస్సులోప్రయాణం చేస్తున్న 24మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు మహిళలకు తీవ్రంగా గాయడ్డారు. మరో 22మందికి స్వల్పగాయాలు అయ్యాయి. తీవ్రగాయాలైన వారిలో కనిగిరి మండలం పెదగొల్లపల్లికి చెందిన వేంపాటి నరసమ్మ, పోటు సుబ్బులు ఉన్నారు.
మైలవరం, జూలై 11: కడప జిల్లా మైలవరం మండలం రామచంద్రాయపల్లెలో గురువారం నాటుబాంబు పేలి రైతు సోమశేఖర్ గాయపడ్డాడు. సోమశేఖర్ పొలం పనులు చేస్తుండగా గట్టులో పాతిపెట్టిన ప్లాస్టిక్ బకెట్ కనిపించింది. దాన్ని తీసి పక్కనపెడుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో సోమశేఖర్ ఎగిరి అల్లంతదూరంలో పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
న్యూఢిల్లీ, జూలై 11: అయోధ్యలో రామమందిరం, బాబ్రీ మసీదు స్థల వివాదం పరిష్కారంలో మధ్యవర్తుల కమిటీతో ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు గురువారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.