S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/08/2019 - 23:31

న్యూఢిల్లీ, జూలై 8: దేశంలోని అన్ని జిల్లాల్లో మానవ హక్కుల కోర్టుల ఏర్పాటుపై మీ వైఖరి ఏమిటని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అన్ని జిల్లాల్లో మానవ హక్కుల కోర్టు ఏర్పాటు తప్పనిసరి అని అంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారంనాడు దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించింది.

07/09/2019 - 01:40

న్యూఢిల్లీ: తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన రిట్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అవకతవకల మూలంగానే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొన్నారని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కొండలరావు అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ ఎస్‌ఏ బాబ్డె, జస్టిస్ బీఆర్ గావిలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.

07/08/2019 - 03:59

గుంతకల్లు, జూలై 7: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రైల్వే ఇనిస్టిట్యూట్‌లో జరుగుతున్న వివాహ వేడుకలో ఆదివారం తెల్లవారుజామున పెళ్లి కుమారుడి తరఫు బంధువులకు సంబంధించిన దాదాపు 60 తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు గుంతకల్లు 1వ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. సీఐ ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాలు..

07/08/2019 - 01:33

జాష్‌పూర్/రాయ్‌పూర్, జూలై 7: ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ దఫా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో చత్తీస్‌గఢ్ పోలీసు స్టేషన్ పోలీసులు శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

07/08/2019 - 00:49

కర్నల్ (హర్యానా), జూలై 7: ఉద్యోగం నుంచి తొలగించారన్న కక్షతో ఓ యువకుడు ఇద్దరు స్నేహితులతో కలిసి డాక్టర్‌ను హత్య చేసిన ఘటన కర్నల్‌లో కలకలం రేపింది. డాక్టర్ రాజీవ్ గుప్తా (56) శనివారం తన ఆసుపత్రి నుంచి కారులో ఇం టికి బయలుదేరారు. చౌరా బజార్ ప్రాంతం లో మాస్క్ ధరించిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి కారుకు అడ్డంగా పెట్టారు. వెంటనే దుండగులు వాహనంలో కూర్చోని ఉన్న డాక్టర్‌పై కాల్పులు జరిపారు.

07/07/2019 - 04:55

విశాఖపట్నం (క్రైం), జూలై 6: అప్పుల బాధతో ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె మృతి చెందగా, భార్య అపస్మారక స్థితిలో వైద్య చికిత్స పొందుతోంది. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (సింహాచలం) సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

07/07/2019 - 05:15

ఎర్రగుంట్ల: కడప జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఎర్రగుంట్ల మండలం కోడూరు గ్రామ సమీపంలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఈశ్వరమ్మ(60), అంజనమ్మ(55), లక్ష్మీదేవి(60) అక్కడికక్కడే మృతి చెందారు. వెంకట సుబ్బయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా కడప చలమారెడ్డి పల్లెకు చెందిన వారు.

07/07/2019 - 04:19

చెన్నై, జూలై 6: తమిళనాడు ప్రభుత్వం 2017లో నేషనల్ ఎలిజిబిలిటి-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ రాష్ట్రపతికి పంపించిన రెండు బిల్లులను ఆయన తిరస్కరించారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మద్రాస్ హైకోర్టుకు తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఈ విషయమై సమాచారం ఉందని హైకోర్టుకు చెప్పారు.

07/07/2019 - 02:00

కూచిపూడి, జూలై 6: మతి స్థిమితం లేని 51 సంవత్సరాల వ్యక్తి హైటెన్షన్ విద్యుత్ వైర్లు పట్టుకుని మృతి చెందిన మొవ్వ శివారు యద్దనపూడి డొంకలో చోటు చేసుకుంది. మొవ్వ శివారు మూలపాలెంకు చెందిన కె వెంకటరెడ్డి (51) శుక్రవారం తెల్లవారు జామున ఇంటి నుంచి బయటకు వెళ్లి రాలేదు. అతని కోసం కుటుంబ సభ్యులు వెతికినా కనపడలేదు.

07/07/2019 - 01:50

ఖైరతాబాద్, జూలై 6: పంజాగుట్ట పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో వ్యాపారిపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం.. గచ్చిబౌలిలో నివాసం ఉండే, రాంప్రసాద్ (45) వ్యాపారి. పంజాగుట్ట దుర్గానగర్ కాలననీల్లో ఇతనికి కార్యాలయం ఉంది.

Pages