S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/04/2019 - 04:44

సింగరాయకొండ, జూలై 3 : అర్ధరాత్రి నిద్రమత్తులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలోని కనుమళ్ల జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన కె రామకృష్ణ, కె సత్యకృష్ణ, కె విజయ, కె సుజాత గత రెండు రోజుల క్రితం తిరుమలకు వెళ్లారు.

07/04/2019 - 04:42

పూతలపట్టు, జూలై 3: జాతీయ రోడ్డు నిర్మాణాకినికి సంబంధించిన స్టోర్ రూమ్ ఆగ్నికి ఆహుతి కావడంతో సుమారు ఐదుకోట్ల రూపాయల అస్తినష్టం జరిగింది. చిత్తూరు జిల్లా పూతల పట్టు వద్ద ఈ ఘటన బుధవారం జరిగింది. జిల్లాలో చిత్తూరు- తిరుపతి జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను కెఎన్‌ఆర్ కనస్ట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తోంది.

07/04/2019 - 04:20

హైదరాబాద్, జూలై 3: జెడ్డా నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా అక్రమ మార్గంలో బంగారాన్ని తరలించే ప్రయత్నలో14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తుల నుంచి 6.5 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ. 2. 20 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

07/04/2019 - 04:13

పులివెందుల, జూలై 3: మాజీ మంత్రి వై ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు అనుమానితులందరినీ రహస్యంగా విచారిస్తున్నారు. ఇందులో భాగంగా వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్యకు సత్యశోధన పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.

07/04/2019 - 04:09

తిరుపతి, జూలై 3: తిరుమలలో అత్యంత ప్రముఖులు బసచేసే పద్మావతి అతిథిభవనాల సముదాయంలోని మణిమంజరి అతిథిభవనంలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. 10తులాల బరువు కలిగిన వజ్రాలు పొదిగిన ఆభరణాలు, రెండులక్షల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను చోరీ చేసుకెళ్లారు. బాధితులు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి బంధువులు అని తెలిసింది.

07/04/2019 - 03:45

నరసాపురం, జూలై 3: యువతులను నమ్మించి లైంగిక వాంఛ తీర్చుకోవడమే కాకుండా వాటిని వీడియో రికార్డుచేసి, వారిని బ్లాక్‌మెయిల్ చేయడం కోసం నిక్షిప్తంచేస్తున్న ఒక సెల్‌ఫోన్ సెంటర్ నిర్వాహకుడిని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. బాధిత యువతి ఒకరు ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపడంతో పలు అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.

07/04/2019 - 03:44

ముంబయి, జూలై 3: ‘మైనే ప్యార్ కియా’ హీరోయిన్ భాగ్యశ్రీ భర్త హిమాలయా దశానీని పోలీసులు అరెస్టు చేశారు. హిమాలయా దశానీ నటుడు, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ముంబయిలోని సబర్బన్ జోగేశ్వరి ప్రాంతంలో గ్యాంబ్లింగ్ రాకెట్‌లో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడంతో అతనిని మంగళవారంనాడు స్వగృహంలో పోలీసులు అరెస్టు చేసినట్టు అంబోలీ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.

07/04/2019 - 02:07

మచిలీపట్నం (కోనేరుసెంటరు), జూలై 3: గత కొంత కాలంగా మోటారు సైకిళ్లను దొంగిలిస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న దొంగను ఎట్టకేలకు సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజుపేటకు చెందిన మోటారు సైకిళ్ల దొంగ సన్నాల నాగరాజును మీడియా ముందు హాజరు పరిచారు.

07/04/2019 - 01:57

మేడ్చల్, జూలై 3: వివాహిత అదృశ్యమైన సంఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని చంద్రానగర్ కాలనీకి చెందిన జీ.మహేశ్, నందిని(18) గత మే నెల 15వ తేదీన వివాహం చేసుకున్నారు. అనంతరం జూన్ 26వ తేదీన నందిని కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతంలోని తన అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లింది. తిరిగి ఈ నెల 1వ తేదీన మేడ్చల్‌కు చేరుకుంది.

07/04/2019 - 01:56

ఘట్‌కేసర్, జూలై 3: గుట్టు చప్పుడు గాకుండా గంజాయిని విక్రయిస్తున్న ఓ యువకున్ని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఘట్‌కేసర్ ఎక్సైజ్ ఇన్స్‌స్పెక్టర్ మల్లయ్య తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాప్రా సమీపంలోని సాకేత్ వద్ద బుధవారం ఉదయం వాహనాలను తనిఖీలు చేస్తుండగా సాకేత్ నెహ్రునగర్‌కు చెందిన తంగళపల్లి అరుణకుమార్ (21) ద్విచక్రవాహనంలో అరకిలో గంజాయిని తరలిస్తూ పట్టుబడినట్లు తెలిపారు.

Pages