-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, మార్చి 12: పాఠశాలల ఫీజులను భారీగా పెంచడంపై హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్ (149/2016)పై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది.
ముదినేపల్లి, మార్చి 12: ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని మంగళవారం ముదినేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వైవాక గ్రామానికి చెందిన ఆత్మూరి రామాంజనేయులు (50) గత కొంత కాలంగా కల్తీ నెయ్యి తయారు చేయటంతో పాటు విక్రయాలు సాగిస్తున్నాడు.
హైదరాబాద్, మార్చి 12: తక్కవ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశచూపి జనాన్ని మోసం చేసిన ఈ-బిజ్ సంస్థ నిర్వాహకుడు పవన్ మలాన్ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా గొలుసుకట్టు వ్యాపారం చేస్తూ దాదాపు రూ. 1000 కోట్ల వరకు వసూలు చేశారని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో హవాలా ముఠా గుట్టురట్టయింది. హైదరాబాద్ కేంద్రంగా దేశంలోని వివిధ పట్టణాలకు నగదును పంపుతూ కమీషన్ పద్ధతిలో వ్యాపారం చేస్తున్న నలుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి సుమారు రూ. 90.50 లక్షలతో పాటు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు వెల్లడించారు.
కంభం, మార్చి 12: రైలుకింద పడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కంభం రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం జరిగింది. రాజశేఖర్ అలియాస్ అబ్రహం (23) కంభం నుంచి తర్లుపాడు వైపు వెడుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కలవారు గమనించి కంభం రైల్వేస్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు నంద్యాల రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఏ గ్రామానికి చెందిన వాడో వివరాలు తెలియాల్సి ఉంది.
సంతనూతలపాడు, మార్చి 12: సంతనూతలపాడు గ్రామంలో గ్రంధి గిరిజ అనే మహిళ ఇంట్లో దొంగతనానికి గురైన 20సవర్ల బంగారు ఆభరణాలను మంగళవారం పోలీలసులు రికవరీ చేశారు.
ఉప్పల్, మార్చి 12: డ్రైవర్ నిర్లక్ష్యంతో స్కూలు బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..
జీడిమెట్ల, మార్చి 12: భూకబ్జాకు పాల్పడిన ఓ వ్యక్తిని జగద్గిరిగుట్ట పోలీసు లు అరెస్ట్ చేశారు. గాజులరామారం డివిజన్ దేవెందర్నగర్లోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నకిలీ ధ్రువపత్రాన్ని సృష్టించి పేదలకు విక్రయిస్తున్న రమేశ్ పై కుత్బుల్లాపూర్ తహశీల్దార్ గౌతమ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు రమేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఖైరతాబాద్, మార్చి 12: ఇంటర్ మొదటి సంవత్సరం చివరి పరీక్షకు హాజరయ్యేందుకు వెళుతున్న ఓ విద్యార్థి ఆర్టీసీ బస్సు కింద పడి మృతిచెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - యూసుఫ్గూడా నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న షాహీర్ సుభాన్, సయ్యద్ షావుజాన్ పరీక్షకు వెళ్తున్నారు.
ఉప్పల్, మార్చి 12: మల్టీ నేషనల్ కంపెనీలలో కాఫీ షాపులు ఇప్పిస్తానని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టుచేసి మంగళవారం కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు ఉప్పల్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ ఉమా మహేశ్వర్ రావు తెలిపారు.