S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/07/2018 - 01:36

వరంగల్ క్రైం: ఓ కుమారుడి ఆగ్రహం ముగ్గురి సజీవ దహనానికి కారణమైంది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కంఠాత్మకూర్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. పరాయి స్ర్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఓ తండ్రి ప్రాణాల మీదికి తెచ్చింది. తండ్రి తన తల్లిని, చెల్లిని, తనను పట్టించుకోవడం లేదని కొడుకు కొంతకాలంగా పగతో రగిలిపోయాడు.

08/07/2018 - 01:16

గంగాధరనెల్లూరు, ఆగస్టు 6: ఒకే కుటుంబానికి చెందిన అభం శుభం ఎరుగని ముగ్గురు చిన్నారులు తండ్రి చేతిలో బలైపోవడాన్ని జీర్ణించుకోలేని వెంకటేష్ స్వగ్రామం బాలగంగనపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన తండ్రి వెంకటేష్ ముగ్గురు చిన్నారులను హతమార్చిన సంఘటన గంగాధరనెల్లూరులోని నీవా నది వద్ద సోమవారం చోటుచేసుకుంది.

08/07/2018 - 01:35

గంగాధరనెల్లూరు: మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ కసాయి తండ్రి తన ముగ్గురు బిడ్డలను కడతేర్చిన ఘటన సోమవారం చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో జరిగింది. బాలగంగనపల్లి దళితవాడకు చెందిన వెంకటేష్ (35)కు ఏడేళ్ల క్రితం దళితవాడకు చెందిన అమ్ములును వివాహం చేసుకోగా ఆమెకు ఒక కుమార్తె జన్మించింది. సంవత్సరం తరువాత మొదటి భార్య చెల్లెలు అమరావతిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.

08/07/2018 - 00:20

కేతేపల్లి, ఆగస్టు 6: కేతేపల్లి - కొత్తపేట గ్రామాల మధ్య సోమవారం కేతేపల్లి గ్రామానికి చెందిన జంజనం మనోజ్‌కుమార్ (8) మూసీ కుడి కాల్వలో మృతిచెందాడు. మృతుని తండ్రి శివాజీ, ఎస్‌ఐ రజినీకర్ తెలిపిన వివరాల ప్రకారం మనోజ్‌కుమార్ సోమవారం పాఠశాలకు సెలవుదినం కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు మూసీ కుడి కాల్వకు వెళ్లారు. ఈత కొట్టే క్రమంలో ఆకస్మాత్తుగా మనోజ్‌కుమార్ కనిపించకపోవడంతో తోటి స్నేహితులు కేకలు వేశారు.

08/06/2018 - 23:57

చిన్నశంకరంపేట, ఆగస్టు 6: ఊర కుక్కలు గొర్రెల మందపై దాడిచేసిన సంఘటనలో 50 గొర్రెలు మృతిచెందగా మరో 10 గొర్రెల పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన ఆదివారం రాత్రి బాగీర్తీపల్లిలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన పక్కడి అంజయ్య, చింతల సత్యం, కుర్మ క్రిష్ణవేణికి చెందిన గొర్రెలను ఇంటిముందు పాకలో ఉంచారు.

08/06/2018 - 22:39

ఉరవకొండ, ఆగస్టు 6: మండలంలోని అమిద్యాల గ్రామంలో కవిత(26) వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.. ఈసంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

08/06/2018 - 04:15

పర్వతగిరి, ఆగస్టు 5: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి భార్య అడ్డుగా ఉందని చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని పర్వతగిరి మండలం ఏనుగల్ శివారులోని సూర్యతండాలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎసీపీ శోభన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..

08/06/2018 - 02:38

పెనుకొండ, ఆగస్టు 5 : ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలోని జేపీ నగర్‌కు చెందిన కమలమ్మ(76), అనిల్‌కుమార్(50), ఆదిత్య(22) దుర్మరణం చెందారు. వివరాలు.. కమలమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయుర్వేద వైద్యం చేయించేందుకు కారులో బెంగళూరు నుంచి బళ్లారికి బయల్దేరారు.

08/06/2018 - 01:58

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు ఒక భక్తురాలు ఆదివారం సమర్పించిన చీర కొద్ది క్షణాల్లోనే అదృశ్యం కావటం మిస్టరీగా మారింది. ఆషాఢ మాసం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఎస్ పద్మజ అనే భక్తురాలు కొందరు భక్తులతో కలిసి దుర్గగుడికి వచ్చి అమ్మవారికి ఆషాఢ మాసం సారె సమర్పించారు.

08/05/2018 - 22:28

పొదిలి, ఆగస్టు 5 : మద్యానికి బానిసై నిత్యం కుటుంబ సభ్యులను వేధిస్తున్న నేప్యెంలో అతని ప్రవర్తను తట్టుకోలేక భార్య, ఇద్దరు కుమారులు హత మార్చిన సంఘటన శనివారం అర్థరాత్రి పొదిలి పట్టణంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. స్థానిక బుగ్గచలమా ట్యాంకు సమీపంలో నివాసం ఉంటున్న బళ్ళారి ఆనంద్‌బాబు (47) తరచుగా మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధిస్తుండేవాడు.

Pages