S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/11/2018 - 00:58

గౌహతి, ఆగస్టు 10: కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రాన్ గోహైన్‌పై అత్యాచారం కేసు నమోదైంది. 1999 నుంచి బీజేపీ ఎంపీగా ఉంటున్న ఆయనపై ఈ నెల 2వ తేదీన 26 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసినట్లు నాగాన్‌పోలీసులు చెప్పారు. తనపై కేంద్ర మంత్రి గోహైన్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆ యువతి ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో కేంద్ర మంత్రి వయస్సు 68 సంవత్సరాలు.

08/11/2018 - 04:33

న్యూఢిల్లీ: నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్హతలపై తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఒక వ్యక్తి చదవడానికి, ఉత్తీర్ణత పొందడానికి మధ్య తేడాపై సుప్రీంకోర్టు స్పష్టతను ఇచ్చింది.

08/11/2018 - 04:34

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పసిపిల్లలపై అత్యాచారం జరిపితే ఉరిశిక్ష తప్పదని ఇటీవలే కఠిన చట్టం తెచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఈ తాజా ఉదంతంతో తేటతెల్లమవుతోంది. రెండో తరగతి చదువుతున్న ఓ బాలికపై పాఠశాల ప్రాంగణంలోనే పట్టపగలు మూడు పదులు దాటిన ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

08/10/2018 - 23:40

వంగూరు, ఆగస్టు 10: మండల పరిధిలోని ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన దేవయ్య(52) అనే వ్యక్తి కామంతో కళ్లుమూసుకొని పోయి గురువారం రాత్రి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

08/10/2018 - 22:41

మడకశిర, ఆగస్టు 10 : మండల పరిధిలోని గుర్రపుకొండ మలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడి మారుతీ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. కర్నాటక బిదరకెరెకు చెందిన మారుతీ ట్రాక్టర్‌లో కంకరను పావగడలో అన్‌లోడ్ చేసి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా గుర్రపుకొండ మలుపు వద్ద ట్రాక్టర్ ముందు టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపు తప్పి ట్రాలీ బోల్తాపడింది. దీంతో అందులో కూర్చొన్న మారుతీ ట్రాలీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

08/10/2018 - 02:33

వినుకొండ, ఆగస్టు 9: గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు.

08/10/2018 - 02:09

విజయవాడ (క్రైం), ఆగస్టు 9: చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసుకు సంబంధించి సీఐడీ సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఎస్వీ మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసిస్తూ పీజీ చేస్తున్న శిల్ప కళాశాల అక్కడి ప్రోఫెసర్ల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

08/10/2018 - 01:11

న్యూఢిల్లీ, ఆగస్టు 9: రాజకీయాధికారం, వ్యవస్థల్లోకి, ఎన్నికల రాజకీయాల్లో నేరగాళ్లు ప్రవేశించకుండా ఉండేందుకు కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, కాని ఈ చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంటుపై ఉందని, ఈ విషయమై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

08/09/2018 - 23:49

సూర్యాపేట, ఆగస్టు 9: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన సూర్యాపేట కలెక్టరేట్ నిర్మాణ స్థల వివాదానికి తెరపడింది. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నా కొందరు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రైవేట్ స్థలంలో కలెక్టరేట్ భవన నిర్మాణం చేపడుతున్నారన్న ఆరోపణలతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విపక్ష కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్‌ను గురువారం హై కోర్టు కొట్టివేసింది.

08/09/2018 - 23:46

గోదావరిఖని, ఆగస్టు 9: సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాలో రోజు రోజుకు రౌడియిజం మితిమీరిపోతోంది. అనతి కాలంలోనే హత్యలు... అరాచకాలు పెరిగిపోతుండటంతో ఇక్కడ అలజడి మళ్లీ మొదలయ్యింది. నేర సంచనాలకు నిలయమైన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదన్న విమర్శలు తరుచూ జరిగే సంఘటనలను బట్టి చూస్తే రుజువవుతున్నాయి.

Pages