S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/04/2018 - 23:56

బోథ్ రూరల్, ఆగస్టు 4: మండలంలోని మందబొగడ గ్రామానికి చెందిన యువ రైతు సెడ్మకి మారుతి(33) శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మారుతి తనకు ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నాడు.

08/04/2018 - 23:37

కొండమల్లేపల్లి, ఆగస్టు 4: దొంగతనం కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి శనివారం కోర్టులో రిమాండ్ చేసినట్లు కొండమల్లేపల్లి ఎస్ ఐ శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

08/04/2018 - 23:06

బనగానపల్లె, ఆగస్టు 4:బనగానపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని యనకండ్ల గ్రామానికి చెందిన బాషా(7) గత ఏపిల్ 25వ తేదీ విద్యుదాఘాతంతో మృతి చెందగా గ్రామానికి చెందిన గోపాల్ ఫిర్యాదు మేరకు తాము శనివారం పూడ్చిపెట్టిన శవానికి పోస్టుమార్టం చేయించినట్లు సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గ్రామస్థుడు ఫిర్యాదు చేయడంతో తాము తహశీల్దార్ శివరామిరెడ్డి, డా.

08/04/2018 - 22:47

నరసన్నపేట,ఆగస్టు 4: మండలంలోని నారాయణవలస గ్రామం వద్ద వాహనం అదుపుతప్పి ఒకరు దుర్మరణపాలైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కోటబొమ్మాళిమండలం పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన ముద్దాడ సింహాచలం(50)క్రిమిసంహారక మందుల కంపెనీలో సేల్స్ రిప్రజెంటివ్‌గా పనిచేస్తున్నాడు.

08/04/2018 - 22:41

లక్కవరపుకోట, ఆగస్టు 4: మండలంలోని గంగుపూడి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆధిత్య కింతం నారాయణాచార్య(40) అనే వ్యక్తి మృతి చెందాడు.

08/04/2018 - 22:38

పాచిపెంట, ఆగస్టు 4: ట్రాలీ ఢీకొని ఓ యువతి మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పి కోనవలస చెక్‌పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిషా రాష్ట్రం కొరాపుట్ జిల్లా నారిగాం గ్రామానికి చెందిన చిట్టి ఆశా(26) శుక్రవారం రాత్రి మృతిచెందినట్లు ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు.

08/04/2018 - 00:29

హైదరాబాద్, ఆగస్టు 3: సికింద్రాబాద్ లాల్‌గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సట్టా బెట్టింగ్ రాకెట్‌ను టాస్క్ఫుర్స్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో నిందితులు దొరికిపోయారు. దాడుల్లో 12 మందిని అరెస్టు చేశారు. సట్టా బెట్టింగ్‌ను శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు టాస్క్ఫుర్స్ అడిషనల్ కమిషనర్ రాధాకృష్ణా రావు తెలిపారు.
బొమ్మల దిలీప్ కుమార్ అరెస్టు

08/04/2018 - 00:25

బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 3 : ప్రభుత్వ ఆసుపత్రిలో దొంగలు పడి కొన్ని వస్తువులు అపహరించిన సంఘటన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జొన్నవాడ గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక దుండగులు ప్రధాన గేటు తాళాలు పగులకొట్టి లోపలికి జొరబడ్డారు.

08/04/2018 - 00:24

నెల్లూరు, ఆగస్టు 3: నగరంలో ఇళ్లకు కన్నాలు వేసి దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని నెల్లూరు క్రైం బ్రాంచ్, సంతపేట పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను క్రైం బ్రాంచ్ డీఎస్పీ బాలసుందరరావు శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

08/04/2018 - 00:05

నర్సంపేట, ఆగస్టు 3: నర్సంపేట పట్టణంలోని నెక్కొం డ రోడ్‌కు చెందిన ఓ నర్సింగ్ హోం (ప్రైవేట్ ఆసుపత్రి) యజమాని కొంత మంది వద్ద రూ.2కోట్ల పైచీలుకు అప్పు చేసి పరారు అయినట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... చెన్నారావుపేట మండలంలోని ఖాదర్‌పేటకు చెందిన సోదరులిద్దరూ రెండు దశాబ్దాల క్రితం నర్సంపేటకు వచ్చి స్థిరపడ్డారు.

Pages