S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/20/2017 - 18:55

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న పవన్‌కళ్యాణ్ 25వ చిత్రం షూటింగ్ ఇటీవలే విదేశాల్లో ఓ పాట చిత్రీకరణ జరుపుకుంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న పవన్, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయడానికి ప్లాన్ చేశాడు.

09/20/2017 - 18:53

రజనీకాంత్ స్టయిల్ అంటే ఇష్టపడనివారు లేరు. నాకూ ఇష్టమే. అలాగని ఆ స్టయిల్‌ని అనుకరించే విధానం మాత్రం నావద్ద లేదు. అలాగే హీరో అజిత్ అంటే చాలా అభిమానం అని ఎన్‌టిఆర్ అన్నారు. ఆయన నటించిన ‘జై లవకుశ’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ మాటలు చెప్పారు. రజనీకాంత్ శైలి ఇష్టమైనా ఆయన తెరపై కనిపించినపుడు చేసే నటన ఆయన నిలబడిన విధానం ఎప్పటికీ మరువలేను. ఆయన్ను ఒక స్టార్‌గా భావిస్తా.

09/20/2017 - 18:51

గురు తరువాత వెంకటేష్ నటించే సినిమా ఇంతవరకూ ఏదీ కన్‌ఫర్మ్ కాలేదు. ఆ సినిమా వచ్చి ఏడాది గడుస్తున్నా కూడా తదుపరి చిత్రం గురించి ప్రకటన రాకపోవడం విశేషం. ఇప్పటకే పలువురు దర్శకులతో కథా చర్చలు జరిపిన వెంకటేష్, ఆమధ్య పూరి జగన్నాధ్ చెప్పిన కథ కూడా విన్నాడు. కానీ ఆ సినిమా చేయడానికి ఆసక్తిగా లేడని తెలిసింది. తాజాగా, వెంకటేష్ తదుపరి చిత్రానికి ఓకె చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.

09/20/2017 - 18:50

రజత్, నేహా జంటగా ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్‌కుమార్, సునీత నిర్మించిన ‘శ్రీవల్లీ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ- ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా వుంది.

09/20/2017 - 18:48

మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణలో విశాల్ కథానాయకుడిగా జి.హరి రూపొందించిన చిత్రం ‘డిటెక్టివ్’. తుప్పరివాలన్‌గా తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ- మొదటివారం 30 కోట్ల రూపాయలు వసూలు చేసి ఘనవిజయం సాధించిందని, తెలుగులో కూడా అంతే విజయవంతం అవుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు.

09/20/2017 - 18:46

అక్కినేని నాగార్జున, సమంత, సీరత్‌కపూర్ ప్రధాన పాత్రల్లో ఓంకార్ దర్శకత్వంలో పి.వి.పి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కిన రాజుగారి గది-2 చిత్రంలోని ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ- నాన్నగారు మా మధ్య లేరు అనడం తప్పు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. నా కెరీర్‌లో మొదటిసారి ఈ జోనర్‌లో సినిమా చేశాను.

09/20/2017 - 18:43

ఎల్.వి.క్రియేటివ్ ఎంటర్‌టన్‌మెంట్ పతాకంపై అల్లు వంశీ, అక్షర జంటగా బోండా వెంకటస్వామి నాయుడు దర్శకత్వంలో లెంకల అశోక్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘గులాబీ మేడ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమంలో బిగ్ సీడీని ప్రతాని రామకృష్ణగౌడ్, ఆడియో సీడీని నటి కవిత విడుదల చేశారు.

09/20/2017 - 18:42

గ్లామర్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనాకు ఈమధ్య కెరీర్ సాఫీగా సాగడంలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘నక్షత్రం’ అట్టర్‌ఫ్లాఫ్ అవ్వడంతో ఆమె ఆశలు నీరుగారిపోయాయి. ఈ సినిమాలో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసినా కూడా లాభం లేకపోయింది. ప్రస్తుతం తెలుగులో ఓ చిత్రంలో నటిస్తున్న రెజీనా రియల్ లైఫ్‌లో ప్రేమలో విఫలమైందని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి.

09/19/2017 - 22:04

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్యపాత్రలో సమంత, సీరత్‌కపూర్‌లు నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది-2’. ఓంకార్ దర్శకత్వంలో పి.వి.పి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నేడు విడుదల చేయనున్నారు. నాగార్జున కెరీర్‌లో మొదటిసారి హర్రర్, థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇంతకుముందు వచ్చిన ‘రాజుగారి గది’ చిత్రానికి ఇది సీక్వెల్.

09/19/2017 - 19:47

ప్రముఖ నటుడు మోహన్‌బాబు ముఖ్యపాత్రలో మదన్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రస న్నా పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్న గాయత్రి చిత్రంలోని పాటను తిరుపతిలో చిత్రీకరిస్తున్నారు. వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులు, 400మంది డాన్సర్లతో భారీ సెట్‌లో తెరకెక్కిస్తున్న ఈ పాట ను సుద్దాల అశోక్ తేజ రచించగా, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు.

Pages