S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకుశ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తుండడం సంచలనం రేపుతోంది. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా అటు బిజినెస్ వర్గాల్లో కూడా భారీ క్రేజ్ను నింపింది. మూడు పాత్రలతో తనదైన నటనను కనబరచనున్నాడట ఎన్టీఆర్. ముఖ్యంగా ఇందులోని ‘జై’ పాత్రపై సర్వతా ఆసక్తి నెలకొంది.
బాలీవుడ్ లో ఫైర్బ్రాండ్ గా ఇమేజ్ తెచ్చుకున్న కంగనా అంటే అక్కడి జనాలకు కాస్త కంగారే. ఏ విషయాన్నైనా ముఖంమీదే చెప్పి సంచలనం రేపడంలో ఈమె తరువాతే ఎవరైనా. అందుకే ఆమెకు దూరంగా వుండేందుకు సదరు సినిమావాళ్లు ప్రయత్నిస్తుంటారు. నటిగా కూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్న కంగన, తాజాగా మరో సంచలన కామెంట్లతో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా ఆమె మాటలు జనాలకు షాక్ ఇస్తున్నాయి.
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా పటాస్, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’. హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్పై శిరీష్ నిర్మాతగా ఈ చిత్రం నిర్మితమవుతోంది. చిత్రీకరణ పూర్తిచేసుకుని శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు రచించిన ‘అ ఆ’ (అక్కినేని ఆలోచనలు) పుస్తకానికి అనువాద రూపం సిద్ధమైంది. ఈ గ్రంథ ఆవిష్కరణ ఉత్సవం ఈనెల 23న హైదరాబాద్లో జరగనుంది. అక్కినేని రచించన నుడికారాలకు ఆయన స్వయంగా అ ఆ అన్న పేరుతో గతంలో ఓ పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఆ గ్రంధానికే ఇప్పుడు అనువాద రూపం సిద్ధం అయంది.
కొత్త టాలెంట్ను పరిచయం చేయడానికి నాలుగు భారీ సినిమా నిర్మాణ కంపెనీలు ఒక్క తాటిపైకి వచ్చి వి4 క్రియేషన్స్ బ్యానర్ని స్థాపించాయి. గీతా ఆర్ట్స్, యు.వి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్లతో ఏర్పాటైన ఈ సంస్థ ద్వారా తెరకెక్కుతున్న మొదటి చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’. హర్రర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆది, వైభవి శాండిల్య, రష్మి గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించారు.
మహాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా భార త్ కల్చరల్ అకాడమీ తెలు గు టెలివిజన్ రచయితల సంఘం నిర్వహిస్తున్న ఈ పురస్కారాలకుగాను ఈ ఏడాది రచయిత చంద్రబోస్, గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, నాగబాల సురేష్కుమార్, అమరేశ్కుమార్, సాయివెంకట్ తదితరు లు పాల్గొన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా పరిశ్రమలో పెండింగ్లో వున్న సమస్యలకు పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం త్రీ మెన్ కమిటీని నియమించింది. కె.టి.ఆర్, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లతో నిర్మించిన ఈ కమిటీ సూచించిన సలహాలు పరిశ్రమకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు.
దినేష్, మియాజార్జి, రిత్విక ప్రధాన తారాగణంగా సినీ యోగ్ మోషన్ పిక్చర్ పతాకంపై నిర్మాత సురేష్ భల్లా రూపొందిస్తున్న చిత్రం ‘పెళ్లిరోజు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 25న జరగనుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కార్యక్రమానికి నటి జమున, కె.వి.రమణాచారిని అతిథులుగా ఆహ్వానించామని, 1968లో ‘పెళ్లిరోజు’ చిత్రంలో కథానాయికగా జమున నటించారని ఆయన అన్నారు.
రవితేజ కథానాయకుడుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్రాజు రూపొందిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’. ఈ చిత్రానికి సంబంధించి ఫస్టలుక్ను నేడు విడుదల చేయనున్నారు. తొలిసారిగా రవితేజ అంధుని పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా వున్నాయి. అందులోను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అందిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
చేతన్ మద్దినేని, డింపుల్ చోపడే జంటగా శ్రావ్య ఫిలిం పతాకంపై సునీల్కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఎక్కలి రవీంద్రబాబు ఎమ్మెస్ రామ్కుమార్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘గల్ఫ్’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ వారు సినిమాకు యు/ఎ సర్ట్ఫికెట్ అందించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.