S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సాయిధరమ్తేజ్ కొత్త చిత్రం ‘జవాన్’ జనవరి 30న ఎన్టీఆర్ చేతులమీదుగా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ రవి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి 29 నుండి రెగ్యులర్ షూట్కు వెళ్లనుంది. చిత్రం యొక్క షూటింగ్ మొత్తం దాదాపు హైదరాబాద్లోనే జరగనుంది. కేవలం రెండు పాటల కోసం మాత్రం విదేశాలకు వెళ్లనున్నారు టీమ్.
‘రత్తాలు... రత్తాలు’ అంటూ మెగాస్టార్ ఆ అమ్మడి అందాలు పొగిడేస్తూ పాడిన సాంగ్ బాగా పాపులర్ అవ్వడంతో ఈ అమ్మడి అసలు పేరు మరచిపోయి అందరు రత్తాలు.. రత్తాలు అంటూ పిలుస్తున్నారు! అసలే అందాలరాశి పైగా బికినీలో మత్తెక్కిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకున్నారా? రాయ్లక్ష్మి.
ప్రస్తుతం ఎక్కడ చూసినా కాటమరాయుడు హంగామా మొదలైంది. పాటల్లో పవన్కల్యాణ్ హీరోయిన్తో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న దృశ్యం అలరిస్తోంది. ఇతర పాటల్లోని దశ్యాలకు సంబంధించిన స్టిల్స్ తాజాగా విడుదల చేశారు. కాగా పవన్కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమా ఈనెల 24న విడుదలకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. డాలి దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమా తరువాత పవన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న దువ్వాడ జగన్నాథ సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రైలర్తో దుమ్ము రేపిన దువ్వాడ జగన్నాథ సినిమా బిజినెస్ వర్గాల్లో కూడా సంచలనం రేపుతోంది. ‘సరైనోడు’ సినిమా తరువాత మాస్ సినిమాలతో దుమ్ము రేపాలని ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి రెండు వరుసగా హిట్లు ఖాతాలో వేసుకున్న నాగచైతన్య, ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి కల్యాణ్కృష్ణ ప్రాజెక్టు. నాగార్జునకు ‘సోగ్గాడే చిన్ని నాయన’లాంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు నాగచైతన్యను కూడా పూర్తి రొమాంటిక్ యాంగిల్లో చూపించనున్నాడు.
సుహాన్ శిష్టా, ఉజ్వల్ కిరీట్ ప్రధాన తారాగణంగా భగీరధ్ పరశురామ్ ప్రొడక్షన్స్ పతాకంపై రామ కె.శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సరయు’. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయి సెన్సార్కు సిద్ధమైంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్లో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫస్ట్లుక్ను విడుదల చేశారు.
నిఖిల్, రీతూవర్మ, ఇషాగోపికర్ ప్రధాన తారాగణంగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘కేశవ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభించి నాలుగేళ్లయిందని, దీనికి గుర్తింపు లేదనడం సరికాదని, ఆ సంస్థ అధ్యక్షుడు రామకృష్ణగౌడ్ అన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత తాము పెట్టిన టిఎఫ్సిసికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆథరైజేషన్ కూడా పొందామని, తమ ఛాంబర్లో ‘అమ్మకు ప్రేమతో’, ‘దీక్ష’, ‘చిన్న చిన్న ఆశ’, ‘కోమలి’ లాంటి చిత్రాలకు సెన్సార్ కూడా చేశామని అన్నారు.
సోలోగా వస్తే విజయం తథ్యం అంటూ వస్తున్న ‘కాటమరాయుడు’ ట్రైలర్కు మంచి ఆదరణ లభిస్తోందని నిర్మాత శరత్ మరార్ అన్నారు. సినిమా ఈనెల 24న విడుదల కానుందని, ట్రైలర్ ఎంత ఆదరణ పొందిందో సినిమా అంతకన్నా ఎక్కువ విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని ఆయన అన్నారు. నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో పవన్కల్యాణ్, శ్రుతిహాసన్ జంటగా రూపొందిన కాటమరాయుడు ఈనెల 24న విడుదలకు ముస్తాబైంది.
మోహన్లాల్ కథానాయకుడిగా మాజిన్ మూవీ మేకర్స్ పతాకంపై జోషి దర్శకత్వంలో సయ్యద్ నిజాముద్దీన్ తెలుగులో అందిస్తున్న చిత్రం ‘బ్లాక్మనీ’ (అన్నీ కొత్తనోట్లే). ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి క్లీన్ యు సర్ట్ఫికెట్ పొందారు.