S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కృష్ణచైతన్య, భానుచందర్, భానుప్రియ ముఖ్యపాత్రల్లో రవికిరణ్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.ఎల్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న స్టూడెంట్ నెంబర్వన్ చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు భానుచందర్ క్లాప్నివ్వగా, సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు దేవిప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటించిన కన్నడ చిత్రం ‘మమీ’. తెలుగులో ‘చిన్నారి’ పేరుతో ఈనెల 16న విడుదల కానుంది. గతవారం కన్నడలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇంకా హౌస్ఫుల్గా సాగుతోంది. బేబి యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో కె.ఆర్.కె.ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తెలుగు తెరపై చెరగని ముద్రవేసిన నటీమణి ఎవరంటే అందరూ చెప్పే సమాధానం ఒక్కటే- అది మహానటి సావిత్రి. పాత్రలో లీనమై నటించి ప్రేక్షకుల హృదయాల్ని రంజింపచేయగల ఈమె జీవితం తెరపైకి వస్తోంది. ఈమధ్యే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ రూపొందించే ఈ సినిమా త్వరలో సెట్స్పైకి రానుంది.
రోషన్, ఆర్తీ జంటగా సుచేత డ్రీమ్ వర్క్స్ పతాకంపై అళహరి దర్శకత్వంలో విశ్వాస్.హెచ్. రూపొందించిన చిత్రం ‘ప్లస్ ఒన్’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను ఇటీవల హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.
యన్నమలల్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సుప్రీమ్, పావని జంటగా కిషన్ కన్నయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇది ప్రేమేనా’. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. హీరో సుప్రీమ్ మాట్లాడుతూ- ‘విచక్షణ’ అనే చిత్రంలో సెకెండ్ హీరోగా నటించానని, సోలో హీరోగా చేస్తోన్న తొలి చిత్రమని, అందరూ ఆదరించాలని అన్నారు.
సౌత్లో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార, ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు విభిన్నమైన కానె్సప్టులతో యువ హీరోలతో జతకడుతూ దూసుకుపోతోంది. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తున్న ఈమె, రెమ్యూనరేషన్ విషయంలో కూడా సంచలనం రేపుతోంది. సౌత్లో ఇప్పటివరకూ ఏ హీరోయిన్ తీసుకోని పారితోషికాన్ని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు మూడునుండి నాలుగు కోట్ల వరకు వసూలు చేస్తోంది.
రీచాపనయ్, బాహుబలి ప్రభాకర్, పృధ్వీ, బ్రహ్మాజీ, సప్తగిరి ముఖ్యపాత్రల్లో వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై గురురాజ్ నిర్మిస్తున్న ‘రక్షకభటుడు’ చిత్ర టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ నిర్మాత దిల్రాజు పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ఎం.ఎస్.రాజు, దిల్రాజు, దర్శకుడు వంశీకృష్ణ, గురురాజ్ తదితరులు పాల్గొన్నారు.
మలయాళంలో విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పమ్. ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. మలయాళంలో 50 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ చిత్రాన్ని కనుపాపగా అందిస్తున్నామని నిర్మాత దిలీప్కుమార్ బోలుగోటి తెలిపారు.
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై బంపర్హిట్ కొట్టిన ‘జనతా గ్యారేజ్’తో ఎన్టీఆర్ మళ్లీ తన కెరీర్లో పూర్తి ఫామ్లోకి వచ్చేశారు. ఇక ఈ రేంజ్ హిట్ కొట్టాక ఆయన చెయ్యబోయే కొత్త సినిమా ఏమై వుంటుందని అభిమానులంతా ఎదురుచూస్తుండగా, రెండు మూడు నెలలుగా సరైన సమాధానం దొరకలేదు. ఇక ఈ గ్యాప్లో చాలా కథలు విన్న ఎన్టీఆర్, చివరకు దర్శకుడి బాబీకి అవకాశమిచ్చారు.
ఇటీవల హాట్ టాపిక్గా మారిన రామ్గోపాల్వర్మ చిత్రం ‘వంగవీటి’ డిసెంబర్ 23న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో కార్యక్రమం రోజున విజయవాడలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు వంగవీటి రంగా వర్గీయులు, మరోవైపు రామ్గోపాల్వర్మ ఎవ్వరూ ఎక్కడా తగ్గలేదు. కొద్దిసేపట్లోనే ఈ గొడవ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చివరికి ఎలాగో వర్మ విజయవాడలో ఆడియో వేడుక పూర్తిచేశాక అంతా సద్దుమణిగింది.