-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, జూన్ 4: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాను ఏం చేశానో వివరించారు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన సీతారామన్ మంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయారంటూ విమర్శలు వెల్లువెత్తడంపై స్పందించారు.
లక్నో, జూన్ 4: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు మేలు జరిగింది శూన్యమేనని బిఎస్పి అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఆమె యుపి సిఎం అఖిలేష్ యాదవ్ను విడిచిపెట్టలేదు. శనివారం లక్నోలో మాయావతి విలేఖరులతో మాట్లాడుతూ మధురలో జరిగిన మారణకాండపై సిబిఐ లేదా న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
హెరత్, జూన్ 4: అఫ్గానిస్థాన్లో ఒక రోజు పర్యటనకోసం శనివారం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన అమీర్ అమానుల్లా ఖాన్ పురస్కారంతో సత్కరించారు. హెరత్ రాష్ట్రంలోని చిస్తీ-ఎ-షరీఫ్ వద్ద చరిత్రాత్మకమైన అఫ్గాన్-ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ను ప్రారంభించిన అనంతరం అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ ప్రధాని మోదీని ఈ పురస్కారంతో సత్కరించారు.
న్యూఢిల్లీ, జూన్ 4: రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో ఎన్డిఏ బలం పెద్దగా పెరగకపోయినా మొదటిసారి సభలో యుపిఏ కంటే బిజెపి మిత్రపక్షాల సభ్యుల సంఖ్య అధికం అయింది. రాజ్యసభలో యుపిఏ మిత్ర పక్షాల సంఖ్య 70 ఉంటే ఎన్డిఏ మిత్రపక్షాల సభ్యుల సంఖ్య 76కు చేరుకుంటోంది. అయితే రాజ్యసభలో కాంగ్రెస్ 60 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా ఉంటుంది.
మధుర, జూన్ 4: ఉత్తరప్రదేశ్లోని మధురలో భూ ఆక్రమణలు, విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్వాధీన్ భారత్ సుభాష్ సేనకు సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. జవహర్బాగ్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ పార్కులో తిష్టవేసిన సేన సొంతంగా ‘ఓ వ్యవస్థ’నే ఏర్పాటు చేసుకుని అరాచకాలకు పాల్పడుతోంది.
మధుర, జూన్ 4: సొంత నియోజకవర్గం మధురలోని జవహార్బాగ్లో ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన బిజెపి ఎంపీ హేమమాలినికి పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమెకు అనుమతి నిరాకరించినట్టు పోలీసులు వెల్లడించారు. జవహార్బాగ్లో కూంబిం గ్ ఆపరేషన్ జరుగుతున్నందున ప్రజ లు ఎవరినీ అక్కడికి వెళ్లనీయడం లేదని వారన్నారు. ‘ఎంపీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని సమస్యగా చిత్రీకరించొద్దు.
న్యూఢిల్లీ, జూన్ 4: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్తో సంబంధం ఉన్న ఇక్కడి అపోలో ఆసుపత్రిలో జరిగిన కిడ్నీల మార్పిడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు శనివారం ముగ్గురు కిడ్నీ గ్రహీతలను, అయిదుగురు దాతలను గుర్తించారు.
చండీగఢ్, జూన్ 4: రిజర్వేషన్లకోసం జాట్లు మరోసారి ఉద్యమం చేపడుతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ఆదివారం నుంచి మళ్లీ ఆందోళన చేస్తామని జాట్లు ప్రకటించారు. దీంతో 48 కంపెనీల పారా మిలటరీ దళాలను మోహరించారు. ఎక్కడా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ‘రాష్ట్ర పోలీసులతోపాటు 4,800 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించాం.
లక్నో, జూన్ 4: ఉత్తరప్రదేశ్లోని మధురలో భూకబ్జాదారుల దాడి లో మృతి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచింది.
శ్రీనగర్, జూన్ 4: కాశ్మీర్లోని అనంతనాగ్లో శనివారం ఉదయం 11.20 గంటల సమయంలో ఉగ్రవాదులు జరిపిన కా ల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. వారిని అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ బషీర్ అహ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్గా గుర్తించారు. అనంతనాగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 22న ఉపఎన్నిక జరగనుంది. జనవరి 7న ముఫ్తీ మహ్మద్ సరుూద్ మరణించడంతో ఈ సీటు ఖాళీ ఏర్పడింది.