కత్తిమీద సాము
Published Saturday, 10 December 2016వరంగల్, డిసెంబర్ 9: కస్తూరిభా విద్యాలయాలలో ప్రస్తుతం పదవ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తుండగా, ఈ విద్యాలయాలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రిని పలుమార్లు కోరామని చెప్పారు. విద్యాశాఖను పటిష్టపరిచే కార్యక్రమంలో భాగంగా కొత్తగా 256గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించగా, వచ్చే ఏడాది మరో 210గురుకుల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో తరగతులు ప్రారంభిస్తామని అన్నారు.