ఏపికి మరో వంద కోట్ల చిల్లర నోట్లు వస్తున్నాయి!
Published Saturday, 10 December 2016విజయవాడ, డిసెంబర్ 9: రాష్ట్రానికి 100 కోట్ల రూపాయల మేరకు చిన్న నోట్లను ఒకటి, రెండు రోజుల్లో సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిఖ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన విలేఖరులతో శుక్రవారం మాట్లాడుతూ 50, 100, 500 నోట్లు మాత్రమే ఇందులో ఉంటాయని తెలిపారు. దీని వల్ల జిల్లాల్లో చిల్లర నోట్ల సమస్య చాలా వరకూ తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్బిఐ ప్రత్యేకంగా ఈ మేరకు కొంత నగదును పంపనుందన్నారు. రాష్ట్రంలో నగదు కొరత సమస్య ఉన్నప్పటికీ, ఆర్బిఐని సమన్వయం చేసుకుంటూ ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.