జీతాలొచ్చినా తీసుకునేదెలా?
Published Wednesday, 30 November 2016హైదరాబాద్, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయటంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ. 2వేల నోటును అందుబాటులోకి తెచ్చినా, అందుకు సరిపడే చిల్లర లభించటం లేదు. ఈ క్రమంలో నగదు రహిత సేవలపైనే ప్రజలు ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా మరో రెండురోజుల్లో కొత్త నెల ప్రారంభమవుతున్నందున, ఉద్యోగులందరికీ వారి ఖాతాల్లోకి ఆన్లైన్లోనే నగదు జమ అయ్యే అవకాశముండటంతో, దానికి చిల్లర ఎలా అన్న చర్చే జరుగుతోంది. నగరంలోని వివిధ బ్యాంకులకు చెందిన సుమారు ఆరు నుంచి ఆరున్నర వేల వరకు ఏటిఎంలున్నా, వాటిలో సగానికి సగం ఏటిఎంలలో మాత్రమే డబ్బు అందుబాటులో ఉంది.