విజయనగరం పట్టణాభివృద్ధికి ‘మాస్టర్ ప్లాన్’
Published Wednesday, 30 November 2016విజయనగరం, నవంబర్ 29: విజయనగరం పట్టణాభివృద్ధికి వుడా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. విఎంఆర్డిఎ(విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) మాస్టర్ ప్లాన్ ద్వారా భవిష్యత్లో విజయనగరం రూపురేఖలు మారిపోనున్నాయి. మంగళవారం విఎంఆర్డిఎ వైస్ చైర్మన్ టి.బాబురావునాయుడు ఆధ్వర్యంలో మాస్టర్ప్లాన్కు సంబంధించి అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విఎంఆర్డిఎ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 52,93,369 మంది జనాభా ఉందన్నారు.