రాబోయే కాలం మనదే...
Published Wednesday, 30 November 2016వేంపల్లె, నవంబర్ 29: తెలుగుదేశం పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని రాబోయే కాలం మనదే అని వైసీపీ ప్రతిపక్ష నేత, పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఓబులేసురెడ్డి, పుల్లారెడ్డి చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించి వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసేందుకు వచ్చిన ప్రజలతో ఆయన కాసేపు సమావేశమయ్యారు. పక్కా గృహాలు కేటాయించలేదని, వృద్ధాప్య పింఛన్లు కూడా సరిగా రావడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.