S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.2 వేల నోటుకు చిల్లర దొరక్క కూలీ ఆత్మహత్యాయత్నం

నందికొట్కూరు, నవంబర్ 29: పెద్దనోట్ల రద్దు, చిన్న నోట్ల కొరత సామాన్యుల ప్రాణాలమీదికి తెస్తోంది. రూ.2 వేల నోటుకు చిల్లర దొరక్క విసిగివేశారిన కూలీ ముర్తుజావలీ(40)మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డినగర్ కాలనీకి చెందిన ముర్తుజావలి(40) కంకరపని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారం రోజుల పాటు కూలీపని చేసినందుకు యజమాని కూలిడబ్బుల కింద రూ.2 వేల నోటు ఇచ్చాడు. దీంతో మంగళవారం నిత్యావసర సరుకుల కోసం కిరాణా దుకాణాలకు వెళ్లగా పెద్దనోటుకు తమ వద్ద చిల్లర లేదని, మొత్తం రూ.

వరి రైతుకు కరెన్సీ కష్టాలు

రాజమహేంద్రవరం, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం మంచి చెడులను ఎంచిచూడటం గత 20 రోజులుగా నిత్యకృత్యం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్ పండించిన వరి రైతులపై మాత్రం ఆ ప్రభావం దారుణంగా పడుతోంది. ఒకపక్క దిగుబడులు అతితక్కువగా లభిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు పండిన పంటను అమ్ముకున్నా ఇప్పట్లో నగదు చేతికి వచ్చే అవకాశం లేక అతలాకుతలమవుతున్నారు. బియ్యం లెవీ సేకరణ బాధ్యతల నుండి ఎఫ్‌సిఐ తప్పుకున్న తర్వాత రాష్ట్రంలో ఐకెపి, సహకార సంఘాల ద్వారా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలుచేయించి, మిల్లర్లతో కస్టమ్ మిల్లింగ్ చేయించి, బియ్యం తీసుకుంటోంది.

విగ్రహాల తరలింపునకు నిరసనగా దీక్ష

గన్నవరం, నవంబర్ 29: కృష్ణా జిల్లా చిక్కవరం శ్రీ బ్రహ్మయ్యలింగేశ్వర స్వామి దేవస్థానంలోని విగ్రహాల తరలింపునకు నిరసనగా మంగళవారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు నిరాహారదీక్ష చేపట్టారు. గత గురువారం రాత్రి ఆలయంలోని విగ్రహాలు శివలింగం, నందీశ్వరుడు, అమ్మవారి విగ్రహం, నవగ్రహాలు, అయ్యప్పస్వామి విగ్రహాలను అనాయంగా తరలించారని, వాటిని యథాస్థానంలో పునః ప్రతిష్ఠ చేయాలని డిమాండ్ చేస్తూ ఆలయ ప్రాంగణంలోనే నిరశన దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయం తీసుకువెళతామన్నారు. విగ్రహాలు ఆట బొమ్మలు కాదని, నిర్వాహకులు దేవుడి బొమ్మలను ఆట బొమ్మలుగా తరలించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొలిక్కిరాని అమరావతి లోగో

గుంటూరు, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి లోగోపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. ఏడాది క్రితమే ఇందుకు సంబంధించిన డిజైన్లకు రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది. అంతేకాదు ఉత్తమమైన లోగోకు లక్ష రూపాయల పారితోషికాన్ని కూడా ప్రకటించింది. ప్రజా రాజధానిగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పటంతో పాటు ఈ ప్రాంత ప్రజల జీవనశైలిని ప్రతిబింబించే విధంగా కృష్ణాతీరంలో రాజధాని ఉండేలా డిజైన్లను రూపొందించాలని సూచించారు. ఇందులో భాగంగా రెండు వేల మంది నుంచి సిఆర్‌డిఎకు డిజైన్లు అందాయి.

పారదర్శకతకు పెద్దపీట

విజయవాడ, నవంబర్ 29: డిజిటలైజేషన్‌లో దూసుకుపోతున్న ఎపి ప్రభుత్వం అన్ని రంగాల్లో పారదర్శకత ప్రదర్శిస్తోంది. డిజిటలైజేషన్ రంగంలో దేశంలో ఎపి ప్రభుత్వం ప్రథమ స్థానం సాధించి, అవార్డు పొందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు శాఖల్లో డిజిటలైజేషన్ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగినట్లు, అక్రమార్జనకు కళ్ళెం పడి అవినీతి తగ్గినట్లు నీతి అయోగ్ ప్రశంసించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ (సిఆర్‌డిఎ)కు సంబంధించి కూడా సిఎం డ్యాష్‌బోర్డు మాదిరి డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేశారు. ఈ డ్యాష్ బోర్డులో సిఆర్‌డిఏకు సంబంధించిన అన్ని విభాగాల వివరాలు పొందుపరచారు.

‘గంటా’తో తంటా!

అమరావతి, నవంబర్ 29: ఆయన కీలకమైన విద్యాశాఖకు మంత్రి. అందులోనూ సెట్లపై కసరత్తు జరుగుతున్న సమయం. అన్ని సెట్లు ఆన్‌లైన్‌లో నిర్వహించాలా? వద్దా? అంత సామర్థ్యం ఉన్న సంస్థలు అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఆ నేపథ్యంలో మంత్రిగారు మీడియాతో భేటీ అవుతారని సమాచారం వచ్చింది. వచ్చిన అరగంటలోనే మీడియా ప్రతినిధులంతా వెళ్లినా రెండున్నర గంటల వరకూ మంత్రిగారు పత్తాలేరు. పోనీ మంత్రి మీడియా భేటీ రద్దయిందని సొంత శాఖ అధికారులేమైనా సమాచారం ఇచ్చారా అంటే అదీ లేదు. చివరాఖరకు ఈ ఆలస్యం అలవాటు ఇక్కడే కాదు. విశాఖలోనూ మంత్రిగారికి ఉందని తెలుసుకుని వెళ్లిపోవలసి వచ్చింది.

మరో రెండు నెలల్లో జిల్లాల పర్యటన

ఏలూరు, నవంబర్ 29:రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో పర్యటించి, ఆయా కుల సంఘాలు, ప్రతినిధుల నుండి వినతులు స్వీకరించామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కె ఎల్ మంజునాథ్ చెప్పారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నామని, మరో రెండు నెలల్లో మిగిలిన జిల్లాల పర్యటన పూర్తిచేసి, త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రజాసాధికారక సర్వేను కూడా పరిగణనలోనికి తీసుకుని తమ నివేదికను సమర్పిస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో మంగళవారం రాత్రి ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

డిసెంబర్‌లో కాంగ్రెస్ బస్సుయాత్ర?

అమరావతి, నవంబర్ 29: రాష్ట్రంలో నిరాశా నిస్పృహతో ఉన్న శ్రేణుల్లో ఉత్సాహం తీసుకురావడంతోపాటు, నేతలను కదిలించేందుకు పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి మరో ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల ముందు బస్సుయాత్ర నిర్వహించిన నాయకత్వం మళ్లీ ఇప్పుడు కూడా రాష్టవ్య్రాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏఐసిసి నుంచి ఇద్దరు ప్రధాన కార్యదర్శులను యాత్ర ఆసాంతం ఉండేలా చూడటం ద్వారా, నిస్తేజంగా ఉన్న నేతల్లోనూ కదలిక తీసుకురావాలన్న లక్ష్యంతో రఘువీరారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

సింగిల్ పర్మిట్ అమలు చేయాలి

విజయవాడ, నవంబర్ 29: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కోరారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సిఎంను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం దాదాపు రెండు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉందని, దీనిని పరిష్కరించాలని కోరుతూ సిఎంను కలిసేందుకు నిర్ణయించామన్నారు. దాదాపు లక్ష మంది లారీ యజమానులకు సంబంధించిన సమస్య అని తెలిపారు. గతంలో లారీ యజమానులు ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.

విశాఖలో రూ.300 కోట్లతో బల్బ్‌లైన్ ఎలివేటెడ్ కారిడార్

విజయవాడ, నవంబర్ 29: విశాఖ రైల్వే స్టేషన్‌లో ఇంజన్ రివర్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు వీలుగా బల్బ్‌లైన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనను తూర్పు కోస్తా రైల్వే తెరపైకి తెచ్చింది. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయం కాగల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు రైల్వే అధికారులు ఉంచారు. విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ ఉమేష్ సింగ్, వాల్తేరు డివిజన్ డిఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీని కలిసి వాల్తేరు పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పరిధిలో ప్రగతిపై వివరించారు.

Pages