రూ.2 వేల నోటుకు చిల్లర దొరక్క కూలీ ఆత్మహత్యాయత్నం
Published Wednesday, 30 November 2016నందికొట్కూరు, నవంబర్ 29: పెద్దనోట్ల రద్దు, చిన్న నోట్ల కొరత సామాన్యుల ప్రాణాలమీదికి తెస్తోంది. రూ.2 వేల నోటుకు చిల్లర దొరక్క విసిగివేశారిన కూలీ ముర్తుజావలీ(40)మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డినగర్ కాలనీకి చెందిన ముర్తుజావలి(40) కంకరపని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారం రోజుల పాటు కూలీపని చేసినందుకు యజమాని కూలిడబ్బుల కింద రూ.2 వేల నోటు ఇచ్చాడు. దీంతో మంగళవారం నిత్యావసర సరుకుల కోసం కిరాణా దుకాణాలకు వెళ్లగా పెద్దనోటుకు తమ వద్ద చిల్లర లేదని, మొత్తం రూ.