డ్రైవర్కు గుండెపోటు పల్టీకొట్టిన ఆర్టీసీ బస్సు
Published Wednesday, 30 November 2016జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 29: కోదాడ నుండి విజయవాడ వెళుతున్న ఆర్టిసి సిఎన్జి షటిల్ సర్వీస్ బస్సు మంగళవారం ఉదయం 9గంటల సమయంలో చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో పల్టీ కొట్టింది. చిల్లకల్లు దాటిన తరువాత టోల్ ప్లాజా సమీపంలోకి వచ్చేసరికి బస్సు డ్రైవర్ కొండయ్యకు ఛాతిలో నొప్పిరావడంతో స్టీరింగ్ అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకుపోయి టోల్ ప్లాజాకు చెందిన హోర్డింగ్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12మంది గాయపడ్డారు. హోర్డింగ్ను బస్సు ఢీకొట్టకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను, డ్రైవర్ను 108 ద్వారా జగ్గయ్యపేట ఫ్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందజేస్తున్నారు.