రఘువీరారెడ్డిని గిన్సీస్బుక్లో ఎక్కించాలి
Published Tuesday, 22 November 2016విజయవాడ, నవంబర్ 21: సాధారణంగా గణాంకాల్లో ప్రథమ స్థానం, అథమ స్థానం ఉంటాయని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో చంద్రబాబు నాయుడు గిన్నిస్ బుక్లో ఎక్కితే రాష్ట్రంలో కాంగ్రెస్కు సమాధి కట్టిన పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేరును కూడా గిన్నిస్ బుక్లో చేర్చాలని తెలుగుదేశం నగర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో ఇందిరాగాంధీ హయం నుంచి 2014 వరకు ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉందన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభంజనంలో కూడా గట్టి ప్రతిపక్షంగా నిలిచిందన్నారు.