దొరల్లా కాదు... ప్రజాసేవ ముఖ్యం
Published Tuesday, 22 November 2016మహబూబ్నగర్, నవంబర్ 21: ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా అధికారులకు విన్నవించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల తీరుతో అబాసు పాలవుతుంది. అందుకు నిదర్శనం సోమవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి పలువురు జిల్లా అధికారులు రాకపోవడం ఈ విషయాన్ని కలెక్టర్ స్వయంగా అధికారులకు ఫోన్ చేసి చివాట్లు పెట్టిన పరిస్థితి నెలకొంది. ప్రజావాణికి వివిధ శాఖల జిల్లా అధికారులు డుమ్మా కొట్టడం వారు ప్రజావాణికి రాకుండా కిందిస్థాయి అధికారులను పంపించడంతో పద్దతి కాదంటూ కలెక్టర్ రోనాల్డ్ రోస్ అలాంటి అధికారులను బయటకు పంపించేశారు.